షార్జా జైలు నుండి విడుదలైన బాలీవుడ్ నటి క్రిసాన్ పెరీరా
- April 27, 2023
ముంబై: అరెస్టయిన బాలీవుడ్ నటి క్రిసాన్ పెరీరా జైలు నుండి విడుదలయ్యారు. బుధవారం షార్జా సెంట్రల్ జైలు నుండి విడుదలైనట్లు అధికారులు తెలిపారు. జైలు నుండి విడుదలైన అనంతరం తల్లి ప్రమీలా పెరీరాతో మాట్లాడిన వీడియోను ఆమె సోదరుడు కెవిన్ పెరీరా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. క్రిసాన్ విడులైందని.. వచ్చే 48 గంటల్లో భారత్కు తిరిగి వస్తుందని పేర్కొన్నారు. డ్రగ్స్ ఆరోపణలతో ఆమె ఈ నెల 1న షార్జాలో అరెస్టయిన సంగతి తెలిసిందే. అయితే ఇది పథకం ప్రకారం ఆమెను ఇరికించేందుకు జరిగిన కుట్రగా ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గుర్తించారు. నిందితులు ఆంథోనీ పాల్, అతని సన్నిహితుడు రాజేష్ బబొటేలను అదుపులోకి తీసుకున్నారు.
వివరాల ప్రకారం..పెరారీ తల్లి పెంచుకుంటున్న కుక్క కారణంగా ఆమెకు , ఆంథోనీ సోదరికి గతంలో వివాదం జరిగింది. దీంతో ఆగ్రహించిన ఆంథోనీ క్రిసాన్ పెరీరా షార్జాకు తీసుకెళ్లిన ట్రోఫీలో డ్రగ్స్ దాచిపెట్టారు. ఆంథోనీ , అతని సహచరుడు రాజేష్తో కలిసి, అంతర్జాతీయ వెబ్ సిరీస్ కోసం ఉద్దేశించిన ఆడిషన్ కోసం క్రిసాన్ను యూఏఈకి పంపడానికి పథకం పన్నాడు. ఎయిర్పోర్టుకు వెళుతుండగా, డ్రగ్స్ దాచిన ట్రోఫీని ఆమెకు అందించారు. అనంతరం జైలు నుండి బయటకు తీసుకువచ్చేందుకు రూ. 80 లక్షలు ఇవ్వాలని క్రిసాన్ తల్లిని డిమాండ్ చేశారు. సంబంధిత ఆధారాలను షార్జా అధికారులకు పంపడంతో ఆమెను బుధవారం విడుదల చేశారు. క్రిసాన్ సడక్ 2, బాట్లా హౌస్ సినిమాల్లో నటించారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







