మరో ఆరు భారతీయ నగరాలకు సర్వీసుల విస్తరణ: ఎతిహాద్
- April 28, 2023
యూఏఈ: అబుధాబికి చెందిన ఎతిహాద్ ఎయిర్వేస్ తన ప్రయాణీకుల సంఖ్యను మూడు రెట్లు పెంచి 30 మిలియన్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుందని ఎయిర్లైన్స్ చీఫ్ ఆంటోనాల్డో నెవ్స్ వెల్లడించారు. ఎతిహాద్కు భారతదేశం ప్రాధాన్యత కొనసాగుతుందన్నారు. ఎతిహాద్ కు ఉన్న పెద్ద మొదటి మూడు మార్కెట్లలో భారత్ ఒకటిగా ఉందన్నారు. చైనా, ఆగ్నేయాసియా, భారతదేశం, జీసీసీ (గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్) దేశాలను యూరప్, యునైటెడ్ స్టేట్స్ తూర్పు తీరానికి అనుసంధానించాలనే ఆలోచన ఉందని నెవ్స్ చెప్పారు. దేశీయ ప్రయాణీకుల సంఖ్య కోవిడ్ పూర్వ స్థాయికి చేరుకోవడం.. దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతున్నప్పుడు అంతర్జాతీయ ట్రాఫిక్ సేకరణ వేగంతో భారతదేశంలో విమాన ప్రయాణం పెరుగుతోందన్నారు. ఢిల్లీ, ముంబై వంటి ప్రాంతాలకు విమానాలు నడుపుతున్న ఎతిహాద్.. మరో ఆరు భారతీయ నగరాలను గుర్తించిందని, త్వరలోనే విమాన సర్వీసులను ప్రారంభించాలనుకుంటున్నట్లు ఎతిహాద్ సీఈఓ చెప్పారు. టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా యూరప్, యుఎస్లకు నాన్స్టాప్ విమానాలతో దూకుడుగా విస్తరించడంతోపాటు టర్కిష్ ఎయిర్లైన్స్తో తన కోడ్షేర్ ఒప్పందం ద్వారా బడ్జెట్ క్యారియర్ ఇండిగో తన అంతర్జాతీయ నెట్వర్క్ను పెంచుకోవడంతో భారతదేశంలో డిమాండ్ ఉందన్నారు. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత విమానయాన మార్కెట్లో ప్రతి ఒక్కరికీ అవకాశం ఉందని నెవ్స్ చెప్పారు. ఎతిహాద్కు భారతదేశం, అబుధాబిల మధ్య వారానికి 10,000 సీట్లు ఉపయోగించని విమానయాన హక్కులు ఉన్నాయని, ప్రభుత్వ పుష్బ్యాక్ల మధ్య మరింత ప్రాప్యత కోసం డిమాండ్ చేస్తున్న ప్రత్యర్థులతో పోలిస్తే ఇది మెరుగైన స్థితిలో ఉందని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- కేదార్నాథ్ యాత్రలో విషాదం..ముగ్గురు భక్తులు మృతి
- సీఎంగా తొలిసారి ప్రజల్లోకి విజయ్..
- ప్రపంచ వేదిక పై హైదరాబాద్ క్రీడా హ్యాకథాన్కు విశిష్ట గుర్తింపు
- గూగుల్కు రూ.30 లక్షల జరిమానా..హైకోర్టు కీలక తీర్పు
- యాత్రికులకు 25 లక్షలకు పైగా వైద్యసేవలు అందజేత..!!
- నార్త్ అల్ బతినాలో ఆర్థోడాంటిక్ క్లినిక్ సీజ్..!!
- 20వేల డాలర్ల నగదు, గోల్డ్ ఉన్న బ్యాగ్ ను పోగొట్టుకున్న ప్రయాణికురాలు..!!
- డొమెస్టిక్ వర్కర్ చెవి కొరికిన వ్యక్తికి జైలు శిక్ష..!!
- 73 మిలియన్లు దాటిన పేమెంట్స్ సిస్టమ్ లావాదేవీలు..!!
- జూన్ 1 నుండి మిడ్ డే డెలివరీలపై నిషేధం..!!









