ఐపీఎల్ 2023: ఢిల్లీ పై సన్రైజర్స్ విజయం
- April 29, 2023
న్యూ ఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)2023లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ విజయం సాధించింది. లక్ష్య ఛేదనలో ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 188 పరుగులకే పరిమితం కావడంతో సన్రైజర్స్ 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఢిల్లీ బ్యాటర్లలో మిచెల్ మార్ష్(63; 39 బంతుల్లో 1 ఫోర్, 6 సిక్సర్లు), ఫిల్ సాల్ట్(59; 35 బంతుల్లో 9 ఫోర్లు) లు అర్ధశతకాలతో రాణించగా మిగిలిన బ్యాటర్లు విఫలం అయ్యారు. సన్రైజర్స్ బౌలర్లలో మయాంక్ మార్కండే రెండు వికెట్లు పడగొట్టగా, భువనేశ్వర్ కుమార్, నటరాజన్, అకేల్ హోసేన్, అభిషేక్ శర్మ ఒక్కొ వికెట్ తీశారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. సన్రైజర్స్ బ్యాటర్లలో అభిషేక్ శర్మ(67; 36 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్), హెన్రిచ్ క్లాసెన్(53 నాటౌట్ ; 27 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సులు) అర్ధశతకాలతో రాణించాడు. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ మార్ష్ నాలుగు వికెట్లు తీయగా, అక్షర్ పటేల్, ఇషాంత్ శర్మ ఒక్కొ వికెట్ పడగొట్టారు.
ఈ సీజన్లో హైదరాబాద్ జట్టుకు మూడో విజయం. పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది. ఇక నుంచి ఆడే ప్రతి మ్యాచులో విజయం సాధిస్తేనే సన్ రైజర్స్ ప్లే అవకాశాలు సజీవంగా ఉంటాయి.
తాజా వార్తలు
- యూఏఈలో MoHRE ఫీజులు, ఫైన్స్ ఈఎంఐల్లో చెల్లించే అవకాశం..!!
- గోల్డ్ ట్రేడ్ మనీలాండరింగ్పై కువైట్ స్పెషల్ ఫోకస్..!!
- ఖతార్ పాస్పోర్ట్ తో 112 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించే అవకాశం..!!
- సౌదీ–యూఏఈ బంధాలు మరింత బలోపేతం..!!
- ఆసుపత్రిలో మహిళ మృతిపై దర్యాప్తు ప్రారంభం..!!
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం







