త్వరలో సౌదీ అరేబియా పర్యటనకు ఇరాన్ విదేశాంగ మంత్రి
- April 30, 2023
బీరూట్: ఇరాన్ విదేశాంగ మంత్రి హుస్సేన్ అమీర్ అబ్దోల్లాహియాన్ సౌదీ అరేబియాను సందర్శించనున్నారు. ఇటీవల సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ నుండి అధికారిక ఆహ్వానం అందుకున్న తర్వాత తాను అక్కడికి వెళ్లనున్నట్లు తాజాగా ఆయన ప్రకటించారు. లెబనాన్లోని బీరూట్లో విలేకరుల సమావేశంలో ఇరాన్ విదేశాంగ మంత్రి ఈ మేరకు స్పష్టం చేశారు. తాను కూడా టెహ్రాన్ను సందర్శించాలని ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్కు అధికారిక ఆహ్వానాన్ని పంపినట్లు పేర్కొన్నాడు. ప్రిన్స్ ఫైసల్ కూడా ఆహ్వానాన్ని స్వాగతించారని పేర్కొన్నారు. రాయబార కార్యాలయాల విషయానికొస్తే.. సౌదీ అరేబియా, ఇరాన్లోని రెండు రాయబార కార్యాలయాలు రాబోయే కొద్ది రోజుల్లో తిరిగి తెరవబడతాయని ఆయన వెల్లడించారు. రియాద్ , ఇరాన్ మధ్య ఇటీవలి అభివృద్ధి ప్రాంతీయ స్థాయిలో సానుకూల వాతావరణం ఏర్పడిందని ఆయన ధృవీకరించారు. లెబనాన్లో తన 3 రోజుల పర్యటనలో భాగంగా ఇరాన్ విదేశాంగ మంత్రి పర్యటిస్తున్నారు.
తాజా వార్తలు
- ఆధునీకరణ పనులు పూర్తి.. కువైట్ ఆరోగ్య కేంద్రం రీ ఓపెన్..!!
- వచ్చే వారం సముద్రం కల్లోలంగా ఉంటుంది: ఖతార్
- మస్కట్లో పీస్ వాక్.. బీచ్ క్లినింగ్ ఈవెంట్..!!
- జూన్ నెలకి పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!
- కువైట్ లో జూన్ 7నుంచి ఫస్ట్ ఫేజ్ సమ్మర్ హీట్..!
- మక్కా, పవిత్ర స్థలాల్లో 38వేలకుపైగా తనిఖీలు..!!
- ఎబోలా వైరస్ పరిణామాలను పర్యవేక్షిస్తున్నాము: యూఏఈ
- లోక్ భవన్లో ఘనంగా గోవా, సిక్కిం రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- 12 మిలియన్ దిర్హమ్ విలువైన విలాసవంతమైన ఊద్ దొంగతనం..12 గంటల్లో ముఠాను పట్టుకున్న దుబాయ్ పోలీస్
- కోర్టుల చుట్టూ తిరగలేకే మొయిజుద్దీన్ హత్య..ఏడుగురు అరెస్ట్









