BD100,000 విలువైన మాదక ద్రవ్యాలు సీజ్.. ముగ్గురు వ్యక్తులు అరెస్ట్
- April 30, 2023
బహ్రెయిన్: మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్న 27 - 40 సంవత్సరాల మధ్య వయస్సు గల ముగ్గురు వ్యక్తులను బహ్రెయిన్ పోలీసులు నిన్న అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 100,000 బహ్రెయిన్ దినార్ల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. అనుమానితులందరూ ఆసియా జాతీయులేనని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అండ్ క్రిమినల్ ఎవిడెన్స్ యాంటీ నార్కోటిక్స్ విభాగం తెలిపింది. బహ్రెయిన్లో పురుషులు చట్టవిరుద్ధమైన పదార్థాలను విక్రయిస్తున్నట్లు అందిన సమాచారం దర్యాప్తు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందిన వెంటనే విచారణ ప్రారంభించామని, అక్రమ పదార్థాలతో అనుమానితులను గుర్తించి, పట్టుకున్నామని యాంటీ నార్కోటిక్స్ విభాగం అధికారులు తెలిపారు. మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకుని కేసును పబ్లిక్ ప్రాసిక్యూషన్కు అప్పగించారు. ఇంకా, డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ మాదకద్రవ్యాల దుర్వినియోగాన్ని ఎదుర్కోనేందుకు సిద్ధంగా ఉందని, ఎప్పుడైనా హాట్లైన్ (996) ద్వారా మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధించిన ఏవైనా ఫిర్యాదులు లేదా సమాచారాన్ని నివేదించాలని పౌరులు, నివాసితులను కోరింది. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఆధునీకరణ పనులు పూర్తి.. కువైట్ ఆరోగ్య కేంద్రం రీ ఓపెన్..!!
- వచ్చే వారం సముద్రం కల్లోలంగా ఉంటుంది: ఖతార్
- మస్కట్లో పీస్ వాక్.. బీచ్ క్లినింగ్ ఈవెంట్..!!
- జూన్ నెలకి పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!
- కువైట్ లో జూన్ 7నుంచి ఫస్ట్ ఫేజ్ సమ్మర్ హీట్..!
- మక్కా, పవిత్ర స్థలాల్లో 38వేలకుపైగా తనిఖీలు..!!
- ఎబోలా వైరస్ పరిణామాలను పర్యవేక్షిస్తున్నాము: యూఏఈ
- లోక్ భవన్లో ఘనంగా గోవా, సిక్కిం రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- 12 మిలియన్ దిర్హమ్ విలువైన విలాసవంతమైన ఊద్ దొంగతనం..12 గంటల్లో ముఠాను పట్టుకున్న దుబాయ్ పోలీస్
- కోర్టుల చుట్టూ తిరగలేకే మొయిజుద్దీన్ హత్య..ఏడుగురు అరెస్ట్









