అల్ మక్తూమ్ బ్రిడ్జ్ పాక్షికంగా మూసివేత

- April 30, 2023 , by Maagulf
అల్ మక్తూమ్ బ్రిడ్జ్ పాక్షికంగా మూసివేత

దుబాయ్: అల్ మక్తూమ్ వంతెనను మే 13 వరకు పాక్షికంగా మూసివేస్తున్నట్లు దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA) ప్రకటించింది. అయితే, మూసివేతకు గల కారణాన్ని అధికార యంత్రాంగం పేర్కొనలేదు. అర్ధరాత్రి 12:00 గంటల నుండి తెల్లవారుజామున 5:00 గంటల వరకు వారానికి ఆరు రోజులు వంతెన మూసివేయబడుతుందని.. వాహనదారులు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని ఆర్టీఏ కోరింది. ఇటీవల ప్రధాన నిర్వహణ పనుల కారణంగా ఏప్రిల్ 17  నుండి 5 వారాల పాటు ఫ్లోటింగ్ బ్రిడ్జిని రెండు వైపులా మూసివేస్తున్నట్లు ప్రకటించింది.

ఆర్టీఏ సూచించిన ప్రత్యామ్నాయ మార్గాలు: అల్ గర్హౌద్ వంతెన, బిజినెస్ బే బ్రిడ్జ్, అల్ షిందఘ టన్నెల్, ఇన్ఫినిటీ బ్రిడ్జ్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com