యూఏఈలో 20శాతం పెరగనున్న మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు..!
- May 01, 2023
యూఏఈ: యూఏఈలో బీమా కంపెనీల అందించే మెడికల్ ప్రీమియంలు పెరుగనున్నట్లు సమాచారం. మహమ్మారి తర్వాత ప్రతి సంవత్సరం ఆరోగ్య బీమా ప్రీమియంలు క్రమంగా 15 నుండి 20 శాతం పెరుగుతున్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. యూనిట్రస్ట్ ఇన్సూరెన్స్ బ్రోకర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మొయిన్ ఉర్ రెహ్మాన్ మాట్లాడుతూ.. బీమా కంపెనీలు ఇప్పుడు తమ పాలసీదారులకు కఠినమైన నిబంధనలను అమలు చేస్తున్నాయని, అలాగే ప్రీమియంల మొత్తాన్ని కూడా పెంచాయని తెలిపారు. అధిక ప్రీమియంలు పాలసీ తిరస్కరణకు దారి తీయొచ్చన్నారు. ఇన్సూరెన్స్మార్కెట్.ఏఈ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ హితేష్ మోత్వాని మాట్లాడుతూ.. ముఖ్యంగా మహమ్మారి సమయంలో అన్ని ఎలక్టివ్ సర్జరీలను ప్రభుత్వ సూచనల మేరకు నిలిపివేశారని, ప్రస్తుతం వాటిపై ఉన్న ఆంక్షలను సడలించడంతో బీమా కంపెనీలు కొంచెం అప్రమత్తంగా ఉన్నాయని చెప్పారు. శస్త్రచికిత్సలు అవసరమయ్యే కేసులకు బీమా సంస్థలు అధిక ప్రీమియంను వసూలు చేస్తున్నాయని తెలిపారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







