యూఏఈలో 20శాతం పెరగనున్న మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు..!
- May 01, 2023
యూఏఈ: యూఏఈలో బీమా కంపెనీల అందించే మెడికల్ ప్రీమియంలు పెరుగనున్నట్లు సమాచారం. మహమ్మారి తర్వాత ప్రతి సంవత్సరం ఆరోగ్య బీమా ప్రీమియంలు క్రమంగా 15 నుండి 20 శాతం పెరుగుతున్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. యూనిట్రస్ట్ ఇన్సూరెన్స్ బ్రోకర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మొయిన్ ఉర్ రెహ్మాన్ మాట్లాడుతూ.. బీమా కంపెనీలు ఇప్పుడు తమ పాలసీదారులకు కఠినమైన నిబంధనలను అమలు చేస్తున్నాయని, అలాగే ప్రీమియంల మొత్తాన్ని కూడా పెంచాయని తెలిపారు. అధిక ప్రీమియంలు పాలసీ తిరస్కరణకు దారి తీయొచ్చన్నారు. ఇన్సూరెన్స్మార్కెట్.ఏఈ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ హితేష్ మోత్వాని మాట్లాడుతూ.. ముఖ్యంగా మహమ్మారి సమయంలో అన్ని ఎలక్టివ్ సర్జరీలను ప్రభుత్వ సూచనల మేరకు నిలిపివేశారని, ప్రస్తుతం వాటిపై ఉన్న ఆంక్షలను సడలించడంతో బీమా కంపెనీలు కొంచెం అప్రమత్తంగా ఉన్నాయని చెప్పారు. శస్త్రచికిత్సలు అవసరమయ్యే కేసులకు బీమా సంస్థలు అధిక ప్రీమియంను వసూలు చేస్తున్నాయని తెలిపారు.
తాజా వార్తలు
- ఆధునీకరణ పనులు పూర్తి.. కువైట్ ఆరోగ్య కేంద్రం రీ ఓపెన్..!!
- వచ్చే వారం సముద్రం కల్లోలంగా ఉంటుంది: ఖతార్
- మస్కట్లో పీస్ వాక్.. బీచ్ క్లినింగ్ ఈవెంట్..!!
- జూన్ నెలకి పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!
- కువైట్ లో జూన్ 7నుంచి ఫస్ట్ ఫేజ్ సమ్మర్ హీట్..!
- మక్కా, పవిత్ర స్థలాల్లో 38వేలకుపైగా తనిఖీలు..!!
- ఎబోలా వైరస్ పరిణామాలను పర్యవేక్షిస్తున్నాము: యూఏఈ
- లోక్ భవన్లో ఘనంగా గోవా, సిక్కిం రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- 12 మిలియన్ దిర్హమ్ విలువైన విలాసవంతమైన ఊద్ దొంగతనం..12 గంటల్లో ముఠాను పట్టుకున్న దుబాయ్ పోలీస్
- కోర్టుల చుట్టూ తిరగలేకే మొయిజుద్దీన్ హత్య..ఏడుగురు అరెస్ట్









