వలసదారులను అడ్డుకోవద్దు: పోప్ఫ్రాన్సిస్
- May 01, 2023
బుడాపెస్ట్: వలసదారులను అడ్డుకోవద్దని పోప్ ఫ్రాన్సిస్ హంగేరియన్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం బుడాపెస్ట్లోని కొసుత్ లాజ్స్క్వేర్లో నిర్వహించిన కార్యక్రమానికి సుమారు 50,000 మంది ప్రజలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పోప్ మాట్లాడుతూ.. హంగేరియన్లు జీసెస్ను అనుసరించాలనుకుంటే నిరుపేదలు, బాధల్లో ఉన్నవారిని ఆదుకోవాలని అన్నారు. వలసదారులు ఆతిథ్యదేశాల సంస్కృతిని సుసంపన్నం చేయగలరని అన్నారు. వలసదారులను అడ్డుకునేందుకు తలుపులు మూయడం బాధాకరమని, అది జీసెస్ బోధనలకు విరుద్ధమని పేర్కొన్నారు. అలాగే యూరోప్లో పెరుగుతున్న జాతీయవాదం ప్రమాదాల గురించి కూడా హెచ్చరించారు. శనివారం పోప్ సెయింట్ ఎలిజిబెత్ చర్చిలో సుమారు 600 మంది శరణార్థులను కలుసుకున్నారు.
అయితే పోప్ సూచనలను హంగేరియన్ ప్రధాని విక్టర ఓర్బన్ వ్యతిరేకిస్తున్నారు. హంగేరీని వలసదేశంగా మార్చేందుకు తాను అనుమతించబోననని హెచ్చరించారు. వారు స్థానిక ప్రజల నైతిక గుర్తింపుకు అడ్డుపడుతున్నారని అన్నారు. వలసదారులను అడ్డుకునేందుకు 2015లో ఓర్బాన్ సెర్బియా సరిహద్దులో స్టీల్ ఫెన్సింగ్ను ఏర్పాటు చేశారు. దేశ రాయబార కార్యాలయాల్లో ఆశ్రయం కోరుతూ సమర్పించే దరఖాస్తులను కూడా పరిమితం చేస్తున్నట్లు పేర్కొన్నారు. గతేడాది కేవలం 18 మంది మాత్రమే శరణార్థుల హోదాను పొందారు. ఇతర దేశాలతో పోలిస్తే .. ఇది చాలా హాస్యాస్పదమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తాజా వార్తలు
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం







