గో ఫస్ట్ విమానాలు రద్దు.. ఇండియా-యూఏఈ ప్రయాణికులపై ప్రభావం..!
- May 03, 2023
యూఏఈ: మే 3, 4, 5వ తేదీల్లో క్యారియర్ విమానాలను రద్దు చేయడంతో బారత్-యూఏఈ మధ్య అత్యంత తక్కువ ధర కలిగిన ఎయిర్లైన్ గో ఫస్ట్తో ప్రయాణించడానికి బుక్ చేసుకున్న ప్రయాణికులు తీవ్రంగా ప్రభావితమయ్యారు. ఈ ఎయిర్లైన్ భారతదేశంలోని అనేక నగరాల నుండి అబుధాబి, దుబాయ్లకు సర్వీసులను అందిస్తోంది. యూఏఈలోని ట్రావెల్ ఏజెంట్లు మాట్లాడుతూ చాలా మంది ప్రయాణికులు ప్రత్యామ్నాయ విమానాల్లో రీబుక్ చేసుకుంటున్నారని తెలిపారు. మే 3-5 తేదీల మధ్య షెడ్యూల్ చేయబడిన విమాన సర్వీసులను "ఆపరేషన్ కారణాల వల్ల" రద్దు చేయబడినట్లు ఎయిర్లైన్ తన వెబ్ సైట్లో వెల్లడించింది. “విమానాలు రద్దు చేయడం వల్ల కలిగిన అసౌకర్యానికి మేము క్షమాపణలు కోరుతున్నాము. త్వరలోనే టికెట్లు రద్దయిన వారికి పూర్తి వాపసు చేయబడుతుంది. ”అని తెలిపింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







