హైదరాబాద్ పై కోల్కతా విజయం...
- May 04, 2023
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2023లో భాగంగా ఉప్పల్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్ 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. లక్ష్యఛేదనలో సన్రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 166 పరుగులకే పరిమితమైంది. ఆఖరి ఓవర్లో సన్రైజర్స్ విజయానికి 9 పరుగులు అవసరం అయ్యాయి. మొదటి రెండు బంతులకు రెండు పరుగులు రాగా.. మూడో బంతికి అబ్దుల్ సమద్ ఔట్ అయ్యాడు. మిగిలిన మూడు బంతుల్లో ఒకే పరుగు వచ్చింది.
సన్రైజర్స్ బ్యాటర్లలో మార్క్రమ్(41; 40 బంతుల్లో 4 ఫోర్లు), క్లాసెన్(36; 20 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లు), రాహుల్ త్రిపాఠి(20; 9 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), అబ్దుల్ సమద్(21; 18 బంతుల్లో 3 ఫోర్లు) లు రాణించారు. కోల్కతా బౌలర్లలో వైభవ్ అరోరా, శార్దూల్ ఠాకూర్ లు చెరో రెండు వికెట్లు తీయగా హర్షిత్ రాణా, ఆండ్రీ రస్సెల్, అనుకుల్ రాయ్ లు ఒక్కొ వికెట్ పడగొట్టారు.
అంతక ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోల్కతా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. కోల్కతా బ్యాటర్లలో రింకూ సింగ్(46; 35 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), నితీశ్ రాణా(42; 31 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించగా ఆండ్రీ రస్సెల్(24; 15 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లు) పర్వాలేదనిపించాడు. సన్రైజర్స్ బౌలర్లలో మార్కో జాన్సెన్, నటరాజన్లు చెరో రెండు వికెట్లు తీయగా, భువనేశ్వర్ కుమార్, కార్తీక్ త్యాగి, మార్క్రమ్, మయాంక్ మార్కండే ఒక్కొ వికెట్ పడగొట్టారు.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







