సౌదీ ట్రావెల్: మూడు నెలల్లో 8 మిలియన్ల మంది పర్యాటకులు
- May 06, 2023
సౌదీ అరేబియా: 2023 మొదటి త్రైమాసికంలో 8 మిలియన్ల మంది పర్యాటకులు సౌదీ అరేబియాను సందర్శించారు. ఇది తాము రూపొందించిన అంచనాల కంటే అధికమని సౌదీ టూరిజం అథారిటీ సీఈఓ ఫహద్ హమిదాద్దీన్ తెలిపారు. 2022లో సౌదీని 93 మిలియన్ల మంది పర్యాటకులు సందర్శించారని పేర్కొన్నారు. 2023 మొదటి 3 నెలల్లో ఉమ్రా సందర్శనల సంఖ్య 4 మిలియన్లకు చేరుకుందని దుబాయ్లో అరేబియా ట్రావెల్ మార్కెట్ ఎగ్జిబిషన్ సందర్భంగా హమీదాద్దీన్ తెలిపారు. సౌదీ అరేబియాలో ప్రస్తుతం 42,000 హోటల్ గదులు నిర్మాణంలో ఉన్నాయని, 2030 చివరి నాటికి హోటల్ గదుల సంఖ్య 700,000 దాటుతుందని భావిస్తున్నామని హమీదాద్దీన్ చెప్పారు. సౌదీ వింటర్ సీజన్ మాదిరిగానే, రాజ్యంలో వేసవి సీజన్లో భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొంటారని ఆయన తెలిపారు. ఏడాది వ్యవధిలో ప్రభుత్వం వేర్వేరు వీసాలను ప్రకటించడం వల్ల సౌదీ అరేబియాకు వచ్చేందుకు టూరిస్టులు ఆసక్తి చూపుతున్నారని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







