సౌదీ ట్రావెల్: మూడు నెలల్లో 8 మిలియన్ల మంది పర్యాటకులు
- May 06, 2023
సౌదీ అరేబియా: 2023 మొదటి త్రైమాసికంలో 8 మిలియన్ల మంది పర్యాటకులు సౌదీ అరేబియాను సందర్శించారు. ఇది తాము రూపొందించిన అంచనాల కంటే అధికమని సౌదీ టూరిజం అథారిటీ సీఈఓ ఫహద్ హమిదాద్దీన్ తెలిపారు. 2022లో సౌదీని 93 మిలియన్ల మంది పర్యాటకులు సందర్శించారని పేర్కొన్నారు. 2023 మొదటి 3 నెలల్లో ఉమ్రా సందర్శనల సంఖ్య 4 మిలియన్లకు చేరుకుందని దుబాయ్లో అరేబియా ట్రావెల్ మార్కెట్ ఎగ్జిబిషన్ సందర్భంగా హమీదాద్దీన్ తెలిపారు. సౌదీ అరేబియాలో ప్రస్తుతం 42,000 హోటల్ గదులు నిర్మాణంలో ఉన్నాయని, 2030 చివరి నాటికి హోటల్ గదుల సంఖ్య 700,000 దాటుతుందని భావిస్తున్నామని హమీదాద్దీన్ చెప్పారు. సౌదీ వింటర్ సీజన్ మాదిరిగానే, రాజ్యంలో వేసవి సీజన్లో భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొంటారని ఆయన తెలిపారు. ఏడాది వ్యవధిలో ప్రభుత్వం వేర్వేరు వీసాలను ప్రకటించడం వల్ల సౌదీ అరేబియాకు వచ్చేందుకు టూరిస్టులు ఆసక్తి చూపుతున్నారని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- ఢిల్లీ మెట్రో రైల్ లో ఉపాధి అవకాశాలు
- నాలుగు కొత్త అబ్షర్ సేవలు ప్రారంభం..!!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. Dh7,000 ఖర్చు చేస్తున్న ఫ్యాన్స్..!!
- హవాలీ లో మెడికల్ సెంటర్ సీజ్..!!
- మెరైన్ స్పోర్ట్స్ లో పాల్గొన్న బహ్రెయిన్ కింగ్..!!
- ఖతార్ లో గ్లోబర్ డొమెస్టిక్ మినిమం ట్యాక్స్ కు సవరణలు..!!
- ఐరన్మ్యాన్ వరల్డ్ ఛాంపియన్షిప్.. పాక్షిక ట్రాఫిక్ ఆంక్షలు..!!
- ఏపీ: రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం
- ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమంటూ తారిఖ్ రహ్మాన్ ప్రకటన
- తెలంగాణ: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు..









