సౌదీ ట్రావెల్: మూడు నెలల్లో 8 మిలియన్ల మంది పర్యాటకులు
- May 06, 2023
సౌదీ అరేబియా: 2023 మొదటి త్రైమాసికంలో 8 మిలియన్ల మంది పర్యాటకులు సౌదీ అరేబియాను సందర్శించారు. ఇది తాము రూపొందించిన అంచనాల కంటే అధికమని సౌదీ టూరిజం అథారిటీ సీఈఓ ఫహద్ హమిదాద్దీన్ తెలిపారు. 2022లో సౌదీని 93 మిలియన్ల మంది పర్యాటకులు సందర్శించారని పేర్కొన్నారు. 2023 మొదటి 3 నెలల్లో ఉమ్రా సందర్శనల సంఖ్య 4 మిలియన్లకు చేరుకుందని దుబాయ్లో అరేబియా ట్రావెల్ మార్కెట్ ఎగ్జిబిషన్ సందర్భంగా హమీదాద్దీన్ తెలిపారు. సౌదీ అరేబియాలో ప్రస్తుతం 42,000 హోటల్ గదులు నిర్మాణంలో ఉన్నాయని, 2030 చివరి నాటికి హోటల్ గదుల సంఖ్య 700,000 దాటుతుందని భావిస్తున్నామని హమీదాద్దీన్ చెప్పారు. సౌదీ వింటర్ సీజన్ మాదిరిగానే, రాజ్యంలో వేసవి సీజన్లో భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొంటారని ఆయన తెలిపారు. ఏడాది వ్యవధిలో ప్రభుత్వం వేర్వేరు వీసాలను ప్రకటించడం వల్ల సౌదీ అరేబియాకు వచ్చేందుకు టూరిస్టులు ఆసక్తి చూపుతున్నారని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- అమరావతి మీదుగా హైదరాబాద్-చెన్నై బుల్లెట్ ట్రైన్
- ప్రముఖ ఆలయాల పరిసరాల్లో తిరుమల తరహా నిబంధనలు: సీఎం రేవంత్
- అడ్రస్ ప్రూఫ్ లేకున్నా గ్యాస్ సిలిండర్..కేంద్రం కొత్త రూల్స్
- అమరావతి నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!
- కువైట్ లోని పోర్ట్ కార్యకలాపాలపై అత్యవసర సమావేశం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన కైరో చర్చలు..!!
- వరుస మోటార్సైకిళ్ల చోరీలు..ఏడుగురు అరెస్టు..!!
- శాంతి కోసం..దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమా వరకు బైక్ ర్యాలీ..!!
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!









