సౌదీ ట్రావెల్: మూడు నెలల్లో 8 మిలియన్ల మంది పర్యాటకులు
- May 06, 2023
సౌదీ అరేబియా: 2023 మొదటి త్రైమాసికంలో 8 మిలియన్ల మంది పర్యాటకులు సౌదీ అరేబియాను సందర్శించారు. ఇది తాము రూపొందించిన అంచనాల కంటే అధికమని సౌదీ టూరిజం అథారిటీ సీఈఓ ఫహద్ హమిదాద్దీన్ తెలిపారు. 2022లో సౌదీని 93 మిలియన్ల మంది పర్యాటకులు సందర్శించారని పేర్కొన్నారు. 2023 మొదటి 3 నెలల్లో ఉమ్రా సందర్శనల సంఖ్య 4 మిలియన్లకు చేరుకుందని దుబాయ్లో అరేబియా ట్రావెల్ మార్కెట్ ఎగ్జిబిషన్ సందర్భంగా హమీదాద్దీన్ తెలిపారు. సౌదీ అరేబియాలో ప్రస్తుతం 42,000 హోటల్ గదులు నిర్మాణంలో ఉన్నాయని, 2030 చివరి నాటికి హోటల్ గదుల సంఖ్య 700,000 దాటుతుందని భావిస్తున్నామని హమీదాద్దీన్ చెప్పారు. సౌదీ వింటర్ సీజన్ మాదిరిగానే, రాజ్యంలో వేసవి సీజన్లో భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొంటారని ఆయన తెలిపారు. ఏడాది వ్యవధిలో ప్రభుత్వం వేర్వేరు వీసాలను ప్రకటించడం వల్ల సౌదీ అరేబియాకు వచ్చేందుకు టూరిస్టులు ఆసక్తి చూపుతున్నారని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- 5లక్షల టిక్కెట్లను రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- ఈద్ అల్ అదా..యూఏఈలో 48డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు..!!
- ఎబోలా.. ప్రయాణికుల ఆరోగ్య పర్యవేక్షణపై ఒమన్ సర్క్యులర్..!!
- ఖతార్ లో ప్రైవేట్ కు మూడు రోజులపాటు ఈద్ అల్-అధా సెలవులు..!!
- 9 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- హజ్ కోసం అల్-మషైర్ మెట్రో ప్రారంభం..!!
- అవనిగడ్డలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల ప్రారంభం
- బస్సులో మరింత భద్రత కోసం TGSRTC కీలక నిర్ణయం
- ఈద్ అల్ అదా ముందు టపాసుల వినియోగంపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- చాట్GPT చూసి బాంబుల తయారీ!









