ఓలెక్ట్రా గ్రీన్టెక్కు రూ.66 కోట్ల లాభాలు
- May 06, 2023
హైదరాబాద్: విద్యుత్ బస్సుల తయారీ సంస్థ ఓలెక్ట్రా గ్రీన్టెక్ ఆకర్షణీయ ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం 2022-23లో 84 శాతం వృద్థితో రూ.1,090 కోట్ల రెవెన్యూ ఆర్జించి.. నికర లాభాల్లో 86 శాతం పెరుగుదలతో రూ.65.59 కోట్లను సాధించింది. ఇంతక్రితం ఏడాది రూ.35.35 కోట్ల లాభాలు నమోదు చేసింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో 563 విద్యుత్ బస్సులను డెలివరీ చేసింది. ఇంతక్రితం 2021-22లో 259 ఇ-బస్సులను అందించింది. ప్రస్తుతం 3,394 యూనిట్ల ఆర్డర్ బుక్ను కలిగి ఉన్నట్లు ఆ కంపెనీ తెలిపింది. 2022-23 మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఓలెక్ట్రా రెవెన్యూ 39 శాతం పెరిగి రూ.375 కోట్లకు చేరడంతో రూ.27.81 కోట్ల నికర లాభాలు సాధించినట్లు పేర్కొంది. ''2023 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ, నికర లాభాల పరంగా మెరుగైన వృద్థిని కనబర్చినందుకు సంతోషంగా ఉంది. మా తయారీ సామర్థ్యాన్ని సాంకేతిక సామర్థ్యాలను పెంపొందించడంపై మా దృష్టి కొనసాగుతుంది. దేశ క్లీన్ మొబిలిటీ ఎజెండాకు మా వంతు సహకారం అందించడమే లక్ష్యం.'' అని ఓలెక్ట్రా గ్రీన్ టెక్ సిఇఒ కెవి ప్రదీప్ తెలిపారు.
తాజా వార్తలు
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం







