ప్రముఖ ఆసియా గమ్యస్థానానికి Dh10కే టిక్కెట్

- May 07, 2023 , by Maagulf
ప్రముఖ ఆసియా గమ్యస్థానానికి Dh10కే టిక్కెట్

దుబాయ్: ఫిలిప్పీన్స్‌లోని టాప్ ఎయిర్‌లైన్స్‌లో ఒకటైన సెబు పసిఫిక్, కేవలం 10 దిర్హామ్‌లకే విమాన టిక్కెట్‌లను అందిస్తోంది. శుక్రవారం జరిగిన క్యారియర్ 10వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా అతి తక్కువ విమాన ఛార్జీలను ప్రకటించారు. మే 5 నుండి 9 వరకు, దుబాయ్ నుండి మనీలాకు వెళ్లే ప్రయాణికులు తమ విమానాలను వన్-వే బేస్ ధర Dh10తో బుక్ చేసుకోవచ్చు. ప్రయాణ వ్యవధి తప్పనిసరిగా జూన్ 1 నుండి నవంబర్ 30, 2023 వరకు ఉండాలి. సెబు పసిఫిక్ – దుబాయ్, మనీలా మధ్య ప్రతిరోజూ రెండుసార్లు ప్రయాణించే మార్గం. యూఏఈ నుండి.. వచ్చే ప్రయాణికులకు తక్కువ ఛార్జీలకే టిక్కెట్లను అందిస్తోంది. దీని టిక్కెట్ ధరలు ఇతర విమానయాన సంస్థల కంటే 54 శాతం వరకు తక్కువగా ఉంటాయి. విదేశీ ఫిలిపినోలు, పర్యాటకులకు విమాన ప్రయాణాన్ని మరింత అందుబాటులోకి తీసుకురానుందని ఎయిర్‌లైన్ చీఫ్ మార్కెటింగ్, కస్టమర్ విభాగం హెడ్ కాండిస్ ఐయోగ్ తెలిపారు.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com