సౌదీలో మనీలాండరింగ్ నిరోధక చట్టం సవరణ.. నేరస్థులపై ట్రావెల్ బ్యాన్..!!
- April 18, 2026
రియాద్ః సౌదీ అరేబియా క్యాబినెట్ మనీలాండరింగ్ నిరోధక చట్టానికి సవరణలను ఆమోదించింది. ఇందులో భాగంగా దోషులుగా తేలిన నేరస్థులపై ప్రయాణ నిషేధాన్ని విధించడం, ఆస్తులను జప్తు చేసే చర్యలను విస్తరించడం వంటి కొత్త నిబంధనలను చేర్చింది. సవరించిన ఆర్టికల్ 28 ప్రకారం.. మనీలాండరింగ్ కేసులో జైలు శిక్ష పడిన సౌదీ జాతీయులపై, అంతే కాలానికి విదేశాలకు ప్రయాణించకుండా నిషేధం విధిస్తారు. అదే సౌదీయేతర నేరస్థులు తమ శిక్షాకాలం పూర్తి చేసుకున్న తర్వాత దేశం నుండి బహిష్కరిస్తారు. నిబంధనల ప్రకారం హజ్ లేదా ఉమ్రా యాత్రలకు మినహా తిరిగి రాజ్యంలోకి ప్రవేశించకుండా నిషేధం విధిస్తారు.
ఆర్టికల్ 33 ప్రకారం.. నేరం రుజువైనప్పుడు, కోర్టులు మనీలాండరింగ్ ద్వారా సంపాదించిన నిధులు, సంబంధిత ఆస్తులను జప్తు చేయాలని ఆదేశించవచ్చు. నేరస్థుని చట్టబద్ధమైన ఆదాయానికి మించి ఉన్న ఆస్తులు, అలాగే నేర కార్యకలాపాల నుండి వచ్చినవని రుజువైతే, న్యాయస్థానాలు వాటిని కూడా జప్తు చేయవచ్చు.
సవరించిన నిబంధనల ప్రకారం.. ఆస్తులు నేరంతో ముడిపడి ఉన్నాయని రుజువైతే, అవి నేరస్థుని వద్ద ఉన్నా లేదా మూడవ పక్షం వద్ద ఉన్నా సరే వాటిని జప్తు చేయడానికి న్యాయస్థానాలకు అధికారం ఉంది. అలాగే, లావాదేవీలు లేదా కార్యకలాపాలను రద్దు చేయడానికి లేదా నిలిపివేయడానికి కూడా న్యాయస్థానాలకు అధికారం ఉంటుంది. ఈ సవరణలలో చట్టంలోని అనేక నిబంధనల నుండి “లాభాపేక్ష లేని సంస్థలు” అనే పదాన్ని తొలగించారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







