అంతర్జాల మాధ్యమం ద్వారా ఘనంగా అంతర్జాతీయ కవి సమ్మేళనం
- May 07, 2023
"వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా", "వంశీ ఇంటర్నేషనల్" "శ్రీ సాంస్కృతిక కళాసారథి- సింగపూర్" మరియు "శుభోదయం" సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం అంతర్జాల మాధ్యమం ద్వారా, 12 దేశాల నుండి సుమారు 75 మంది కవులు కవయిత్రులతో "అంతర్జాతీయ కవిసమ్మేళనం" అద్వితీయంగా జరిగింది.
"పింగళి వెంకయ్య రూపొందించిన భారత జాతీయ జండా యొక్క 102వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో భాగంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని, దీనికి పింగళి వెంకయ్య గారి మనుమడు జివియన్ నరసింహం జ్యోతి ప్రకాశనం గావించి ప్రారంభించారని"
నిర్వాహకులు తెలియజేశారు.
భారతదేశం నుండి ప్రముఖ కవులు కవయిత్రులతో పాటుగా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, సింగపూర్, ఇండోనేషియా, ఒమాన్, ఖతార్, బహ్రెయిన్, యూకె, దక్షిణ ఆఫ్రికా, కెనడా, అమెరికా దేశాల నుండి కవులు పాల్గొని, "భారతదేశ జాతీయ సమైక్యత - విశిష్టత" అనే అంశంపై తమ కవితలు వినిపించారు. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా అధ్యక్షులు డా వంగూరి చిట్టెన్ రాజు, సింగపూర్ నుండి శ్రీ సాంస్కృతిక కళాసారథి వ్యవస్థాపకులు కవుటూరు రత్న కుమార్, వంశీ వ్యవస్థాపకులు డా వంశీ రామరాజు తమ ప్రసంగాలను అందించారు. కార్యక్రమ ప్రధాన సమన్వయకర్త రాధిక మంగిపూడి సభను నిర్వహించగా, కృష్ణవేణి సహ వ్యాఖ్యాతగా సహకరించారు. శుభోదయం మీడియా ద్వారా ఈ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేయబడింది.



తాజా వార్తలు
- ఏప్రిల్ 20 నుంచి యూఏఈలో స్కూల్ బస్ సర్వీసులు పునఃప్రారంభం
- హోర్ముజ్ జలసంధిలో మైన్ల తొలగింపు
- అరవింద్ కృష్ణస్వామికి ఘన స్వాగతం పలికిన శంకర నేత్రాలయ USA అట్లాంటా
- హర్మూజ్ పై ఇరాన్ వార్నింగ్..
- దౌత్య సంబంధాలు బలోపేతం..అంటాల్యా ఫోరంలో ఎమీర్..!!
- షురా కౌన్సిల్ ముందుకు కీలక బిల్లులు...!!
- ఖతార్ జాతీయ గుర్తింపు కార్డు వినియోగానికి అనుమతి..ఆరోగ్య కార్డు జారీ నిలిపివేత..!!
- సౌదీలో మనీలాండరింగ్ నిరోధక చట్టం సవరణ.. నేరస్థులపై ట్రావెల్ బ్యాన్..!!
- 100% సామర్థ్యంతో కువైట్ బ్యాంకులు రన్..!!
- దుబాయ్ లో 48 గంటల్లో ఐరిష్ క్రిమినల్ గ్యాంగ్ మెంబర్ అరెస్టు..!!









