బహ్రెయిన్ జనాభాలో 'తీవ్ర అసమతుల్యత'
- May 16, 2023
బహ్రెయిన్: బహ్రెయిన్ ప్రస్తుతం లింగ నిష్పత్తిలో తీవ్రమైన అసమతుల్యతను ఎదుర్కొంటుంది. తాజా డేటా ప్రకారం.. 2022, 2023 మధ్య రాజ్య జనాభా 13,000 పెరిగినప్పటికీ.. మొత్తం జనాభాలో 38.1 శాతం స్త్రీలు, 61.9 శాతం పురుషులు నిష్పత్తి ఉండటం ఆందోళన కలిగిస్తోంది. 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా లింగ నిష్పత్తి తగ్గుతుందని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. ఖతార్, యూఏఈ, బహ్రెయిన్లలో స్త్రీ-పురుష నిష్పత్తులు ఎక్కువగా ఉన్న దేశాలు అని తాజా డేటా చెబుతోంది.
గల్ఫ్ దేశాలు ఇంత అసమాన జనాభా ఉండేందుకు ప్రధానంగా పురుష తాత్కాలిక కార్మికుల పెద్ద వలస జనాభా అధికంగా ఉండటమేనని నిపుణులు చెబుతున్నారు. బహ్రెయిన్ జనాభాలో దాదాపు సగం మంది వలస కార్మికులు ఉండటం వారి వాదనను బలపరుస్తుంది.
ప్యూ రీసెర్చ్ ప్రకారం.. అసమతుల్య లింగ నిష్పత్తికి దోహదం చేసే దేశాలలో సెక్స్-సెలెక్టివ్ అబార్షన్లు, ఆడ శిశుహత్యలు ఎక్కువగా కనిపిస్తుంది. అధ్యయనాలు అసమతుల్య జనాభా ప్రమాదకరమైనదిగా పేర్కొన్నాయి. చాలా సమాజాలలో భాగస్వామి దొరకక పిల్లల జనాభా పెరగడం లేదు. ఇంది పురుషులు, స్త్రీలకు బలమైన సామాజిక నిబంధనలు, ఒత్తిళ్లు తీసుకువస్తున్నాయి. పైగా ఈ సమస్య.. ఆయా వర్గాల దీర్ఘకాలిక ఆర్థిక అవకాశాలపై ప్రభావం చూపుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
తాజా వార్తలు
- అమరావతి మీదుగా హైదరాబాద్-చెన్నై బుల్లెట్ ట్రైన్
- ప్రముఖ ఆలయాల పరిసరాల్లో తిరుమల తరహా నిబంధనలు: సీఎం రేవంత్
- అడ్రస్ ప్రూఫ్ లేకున్నా గ్యాస్ సిలిండర్..కేంద్రం కొత్త రూల్స్
- అమరావతి నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!
- కువైట్ లోని పోర్ట్ కార్యకలాపాలపై అత్యవసర సమావేశం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన కైరో చర్చలు..!!
- వరుస మోటార్సైకిళ్ల చోరీలు..ఏడుగురు అరెస్టు..!!
- శాంతి కోసం..దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమా వరకు బైక్ ర్యాలీ..!!
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!









