ఆర్టీఏ తనిఖీల్లో అడ్డంగా దొరికిన పలువురు ప్రయాణికులు
- May 19, 2023
దుబాయ్: దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) ఇటీవల వరుస తనిఖీ ప్రచారాలను నిర్వహించింది. ఈ సందర్భంగా పబ్లిక్ బస్సులలో వారి నోల్ కార్డ్లను ట్యాప్ చేయని ప్రయాణికులను గుర్తించి వారిపై ఉల్లంఘనలను నమోదు చేసింది. మాస్ ట్రాన్సిట్ నియమాలు, నిబంధనలకు రైడర్ల నిబద్ధతను నిర్ధారించే లక్ష్యంతో రసిద్ ప్రచారం జరిగిందని ఆర్టీఏ తెలిపింది.
ఆరు రోజుల వ్యవధిలో RTA 40,000 తనిఖీలను నిర్వహించింది. దీని ఫలితంగా 1,193 ఉల్లంఘనలను నమోదు చేశారు. దుబాయ్ అమెరికన్ అకాడమీ, అల్ ఖైల్ గేట్, అల్ క్యూజ్, మజ్లిస్ అల్ గరీఫా, బుర్జ్ అల్ అరబ్ హోటల్, అల్ వాస్ల్ స్ట్రీట్తో సహా ఎమిరేట్లోని వివిధ ప్రాంతాలలో ఈ తనిఖీలు నిర్వహించినట్లు ఆర్టీఏ తెలిపింది.
దుబాయ్ పోలీసులు, దుబాయ్లోని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ, ఫారినర్స్ అఫైర్స్తో సహా అనేక సంబంధిత సంస్థల సమన్వయంతో ఈ ప్రచారాలు నిర్వహించినట్లు RTA పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీలో ప్రయాణీకుల రవాణా కార్యకలాపాల పర్యవేక్షణ డైరెక్టర్ సయీద్ అల్ బలూషి తెలిపారు. పబ్లిక్ బస్సు వినియోగదారుల ద్వారా ఛార్జీల ఎగవేతను తగ్గించడం, ఈ విషయంలో అనధికారిక కార్యకలాపాలను నియంత్రించడం లక్ష్యంగా తనిఖీలు సాగాయన్నారు. సంబంధిత ఛార్జీలను నోల్ కార్డులను ఉపయోగించి చెల్లించాలని అల్ బలూషి ప్రయాణికులను కోరారు.
తాజా వార్తలు
- వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు.. నేపాల్కు భారత్ రెస్క్యూ బృందాల సహకారం
- అబుదాబిలో ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ మహమ్మద్
- యూఏఈలో అనధికార ఆన్లైన్ ఫత్వా ఖాతాల పై చర్యలు..
- సెంచరీతో చెలరేగిన డీజీపీ సీవీ ఆనంద్..
- యూఏఈలో పర్సనల్ లోన్ చెల్లింపులు నిలిచిపోతే ఏమవుతుంది?
- దుబాయ్ ఎయిర్పోర్టులో కొత్త స్కానర్లు..
- భారతీయులకు ఉజ్బెకిస్తాన్ బంపరాఫర్..
- మసందమ్లో కొత్త రహదారి..ఖసబ్-దిబ్బా ప్రయాణ సమయం 55 నిమిషాలకు తగ్గింపు
- హైదరాబాద్ లో అతిపెద్ద క్రికెట్ స్టేడియం..
- ప్రధాని మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారం







