ఒమన్ లో 925 మంది ఖైదీలు విడుదల
- May 23, 2023మస్కట్: "ఫక్ కుర్బా" ఇనిషియేటివ్ 10వ ఎడిషన్లో భాగంగా ఒమన్ సుల్తానేట్ లోని వివిధ గవర్నరేట్ల నుండి 925 మంది ఖైదీలు విడుదలైనట్లు ఒమానీ లాయర్స్ అసోసియేషన్ (OLA) వెల్లడించింది. మస్కట్ గవర్నరేట్ నుంచి 194, ఉత్తర అల్ బతినా- 191, దక్షిణ అల్ బతినా- 122, అల్ దహిరా- 97, అల్ బురైమి- 87, అల్ దఖిలియా- 79, ఉత్తర అషర్కీయా- 59, అషర్కీయా- 40, ధోఫర్- 33, అల్ వుస్తా- 20, ముసందం- 3 కేసులు ఉన్నాయని OLA ఛైర్మన్ డా. మహమ్మద్ బిన్ ఇబ్రహీం అల్-జడ్జాలీ తెలిపారు. తాము ఆర్థిక క్లెయిమ్ల కోసం ఖైదు చేయబడిన లేదా జైలులో ఉన్న 5,894 మంది ఖైదీలను సమిష్టిగా విడుదల చేసామన్నారు. దీనిని విజయవంతం చేయడానికి సహకరించిన వ్యక్తులు, సంస్థలకు ధన్యవాదాలు తెలియజేశారు.
తాజా వార్తలు
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం
- మే 13న నాలుగో విడత పోలింగ్..