యువత సాధికారతకు ప్రోత్సహం: HH షేక్ ఖలీద్
- May 24, 2023
బహ్రెయిన్ : బహ్రెయిన్ యువత సాధికారతకు చాలా ప్రాముఖ్యతనిస్తుందని సుప్రీం కౌన్సిల్ ఫర్ యూత్ అండ్ స్పోర్ట్స్ (SCYS) మొదటి డిప్యూటీ చైర్మన్, జనరల్ స్పోర్ట్స్ అథారిటీ (GSA) అధ్యక్షుడు మరియు బహ్రెయిన్ ఒలింపిక్ కమిటీ (BOC) అధ్యక్షుడు హిస్ హైనెస్ షేక్ ఖలీద్ బిన్ హమద్ అల్ ఖలీఫా చెప్పారు. యువత అన్ని రంగాల్లో రాణిస్తున్నారని కొనియాడారు. యూనివర్శిటీ ఆఫ్ బహ్రెయిన్లోని షేక్ అబ్దుల్ అజీజ్ బిన్ మహ్మద్ అల్ ఖలీఫా హాల్లో నిన్న ముగిసిన యూత్ ఎంట్రప్రెన్యూర్షిప్ ఫోరమ్ (మైక్రో షబాబ్) ఐదవ ఎడిషన్ చివరి వేడుకకు హాజరై హెచ్హెచ్ షేక్ ఖలీద్ ప్రసంగించారు. ఫ్యూచర్ సొసైటీ ఫర్ యూత్ హెచ్హెచ్ షేక్ ఖలీద్ ఆధ్వర్యంలో మూడు రోజుల కార్యక్రమాన్ని నిర్వహించింది. ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యూహాల ద్వారా యువతకు మద్దతివ్వడం, పెట్టుబడి పెట్టడం పట్ల క్రౌన్ ప్రిన్స్, ప్రధానమంత్రి అయిన హిస్ రాయల్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా నిబద్ధతను కొనియాడుతూ నివాళులర్పించారు.
తాజా వార్తలు
- కువైట్ అమీర్ను కలిసిన లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఏ.యూసఫ్ అలీ..
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?
- తెలంగాణ కు మూడు ఎయిర్పోర్టులు..
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం







