సౌదీలో అల్-సవారిఖ్ మార్కెట్ మూసివేత
- May 24, 2023
జెడ్డా: జెడ్డా గవర్నరేట్కు దక్షిణంగా ఉన్న అల్-సవారిఖ్ మార్కెట్స్ కాంప్లెక్స్కు ప్రవేశాలను జెడ్డా మేయర్టి మూసివేసింది. వారంలో రెండు అగ్ని ప్రమాదాలు జరగడంతో అధికారులు ఈ చర్యలు చేపట్టారు. మే 12న జరిగిన మొదటి అగ్నిప్రమాదంలో రహ్మానియా మార్కెట్ కాలిపోగా.. మే 21న జరిగిన రెండో అగ్ని ప్రమాదంలో ఫాల్కన్ మార్కెట్ దగ్ధమైంది. కొన్ని ఉల్లంఘనలను గుర్తించిన తర్వాత ఈ మూసివేత చర్యలు తీసుకున్నట్లు మేయర్లటీ వెల్లడించింది. అగ్నిప్రమాదంపై జరిపిన దర్యాప్తులో అనేక ఉల్లంఘనలు జరిగినట్లు గుర్తించామని, ప్రధానంగా దుకాణాల వెలుపల సరుకులను ప్రదర్శించడం, ఉపయోగించిన దుస్తులను విక్రయించడం, అసంఘటిత పద్ధతిలో నిర్వహిస్తున్న స్టాల్స్ ద్వారా గడువు ముగిసిన ఆహార పదార్థాల ప్రదర్శనలు ఉన్నాయన్నారు.
9,000 చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న అల్-సవారిఖ్ మార్కెట్ కాంప్లెక్స్.. విభిన్న వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలలో పాల్గొనే 26 వాణిజ్య సముదాయాలను కలిగి ఉంది. మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, మార్కెట్లో విక్రయాల పరిమాణం సంవత్సరానికి $400 మిలియన్లకు చేరుకుంది.
తాజా వార్తలు
- ఈ లవ్ ప్రమాదకరం..ఎంపైర్ స్టేట్ టవర్ ఎక్కి ఎంగేజ్మెంట్
- ఈ నెల 20 వరకు హజ్ యాత్ర
- అరేబియా సముద్రంలో అమెరికా హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..
- ఒమన్లో అవయవ దాన సంస్కృతి ప్రోత్సహానికి అవేర్నేస్ కార్యక్రమాలు..!!
- 'బిగ్ టికెట్' ఈ-డ్రా: 1,00,000 దిర్హామ్లు గెలిచిన నలుగురు భారతీయులు..!!
- ఇరాన్ దాడుల పై ప్రశంసలు..జైలు శిక్ష ఖరారు..!!
- రియాద్ డ్రగ్ ట్రాఫికింగ్ నెట్వర్క్లో 22 మంది అరెస్ట్..!!
- 'సేవ్ బేబీ మియా' ప్రచారం ద్వారా రూ. 16.5 కోట్లు సమీకరణ..!!
- నంబర్ ప్లేట్ల వేలాన్ని ప్రకటించిన ఖతార్ ట్రాఫిక్ శాఖ..!!
- యూఏఈ లాటరీ..30 మిలియన్ దిర్హమ్ జాక్పాట్ గెలిచిన రెండవ విజేత..!!







