సౌదీలో అల్-సవారిఖ్ మార్కెట్ మూసివేత
- May 24, 2023
జెడ్డా: జెడ్డా గవర్నరేట్కు దక్షిణంగా ఉన్న అల్-సవారిఖ్ మార్కెట్స్ కాంప్లెక్స్కు ప్రవేశాలను జెడ్డా మేయర్టి మూసివేసింది. వారంలో రెండు అగ్ని ప్రమాదాలు జరగడంతో అధికారులు ఈ చర్యలు చేపట్టారు. మే 12న జరిగిన మొదటి అగ్నిప్రమాదంలో రహ్మానియా మార్కెట్ కాలిపోగా.. మే 21న జరిగిన రెండో అగ్ని ప్రమాదంలో ఫాల్కన్ మార్కెట్ దగ్ధమైంది. కొన్ని ఉల్లంఘనలను గుర్తించిన తర్వాత ఈ మూసివేత చర్యలు తీసుకున్నట్లు మేయర్లటీ వెల్లడించింది. అగ్నిప్రమాదంపై జరిపిన దర్యాప్తులో అనేక ఉల్లంఘనలు జరిగినట్లు గుర్తించామని, ప్రధానంగా దుకాణాల వెలుపల సరుకులను ప్రదర్శించడం, ఉపయోగించిన దుస్తులను విక్రయించడం, అసంఘటిత పద్ధతిలో నిర్వహిస్తున్న స్టాల్స్ ద్వారా గడువు ముగిసిన ఆహార పదార్థాల ప్రదర్శనలు ఉన్నాయన్నారు.
9,000 చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న అల్-సవారిఖ్ మార్కెట్ కాంప్లెక్స్.. విభిన్న వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలలో పాల్గొనే 26 వాణిజ్య సముదాయాలను కలిగి ఉంది. మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, మార్కెట్లో విక్రయాల పరిమాణం సంవత్సరానికి $400 మిలియన్లకు చేరుకుంది.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







