సౌదీలో అల్-సవారిఖ్ మార్కెట్ మూసివేత
- May 24, 2023
జెడ్డా: జెడ్డా గవర్నరేట్కు దక్షిణంగా ఉన్న అల్-సవారిఖ్ మార్కెట్స్ కాంప్లెక్స్కు ప్రవేశాలను జెడ్డా మేయర్టి మూసివేసింది. వారంలో రెండు అగ్ని ప్రమాదాలు జరగడంతో అధికారులు ఈ చర్యలు చేపట్టారు. మే 12న జరిగిన మొదటి అగ్నిప్రమాదంలో రహ్మానియా మార్కెట్ కాలిపోగా.. మే 21న జరిగిన రెండో అగ్ని ప్రమాదంలో ఫాల్కన్ మార్కెట్ దగ్ధమైంది. కొన్ని ఉల్లంఘనలను గుర్తించిన తర్వాత ఈ మూసివేత చర్యలు తీసుకున్నట్లు మేయర్లటీ వెల్లడించింది. అగ్నిప్రమాదంపై జరిపిన దర్యాప్తులో అనేక ఉల్లంఘనలు జరిగినట్లు గుర్తించామని, ప్రధానంగా దుకాణాల వెలుపల సరుకులను ప్రదర్శించడం, ఉపయోగించిన దుస్తులను విక్రయించడం, అసంఘటిత పద్ధతిలో నిర్వహిస్తున్న స్టాల్స్ ద్వారా గడువు ముగిసిన ఆహార పదార్థాల ప్రదర్శనలు ఉన్నాయన్నారు.
9,000 చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న అల్-సవారిఖ్ మార్కెట్ కాంప్లెక్స్.. విభిన్న వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలలో పాల్గొనే 26 వాణిజ్య సముదాయాలను కలిగి ఉంది. మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, మార్కెట్లో విక్రయాల పరిమాణం సంవత్సరానికి $400 మిలియన్లకు చేరుకుంది.
తాజా వార్తలు
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్
- కోస్టల్ బీచ్లలో ఖనిజాల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపి బాలశౌరి
- అటల్ జీ ఆశయాలను భవిష్యత్ తరాలకు అందజేయాలి: వెంకయ్యనాయుడు
- పిల్లలకు అందుబాటులో వాట్సప్ కొత్త మోడల్
- ఎల్పీజీ కొరత పై కేంద్రానికి రాహుల్ గాంధీ సూచన
- ఈద్ అల్ ఫితర్ సెలవులు ప్రకటించిన దుబాయ్..!!
- ఇరాన్ కోసం స్పై..నలుగురు బహ్రెయిన్ల అరెస్టు..!!
- లైసెన్స్ లేని ఆర్థిక కార్యకలాపాల పై ఫిర్యాదు చేయండి: CBK
- హరమైన్ హై-స్పీడ్ రైలును ఉపయోగించుకున్న 7లక్షల మంది ప్రయాణికులు..!!
- సలాలా పోర్టు పై ఇరాన్ దాడిని ఖండించిన ఖతార్..!!









