సౌదీలో అల్-సవారిఖ్ మార్కెట్ మూసివేత
- May 24, 2023
జెడ్డా: జెడ్డా గవర్నరేట్కు దక్షిణంగా ఉన్న అల్-సవారిఖ్ మార్కెట్స్ కాంప్లెక్స్కు ప్రవేశాలను జెడ్డా మేయర్టి మూసివేసింది. వారంలో రెండు అగ్ని ప్రమాదాలు జరగడంతో అధికారులు ఈ చర్యలు చేపట్టారు. మే 12న జరిగిన మొదటి అగ్నిప్రమాదంలో రహ్మానియా మార్కెట్ కాలిపోగా.. మే 21న జరిగిన రెండో అగ్ని ప్రమాదంలో ఫాల్కన్ మార్కెట్ దగ్ధమైంది. కొన్ని ఉల్లంఘనలను గుర్తించిన తర్వాత ఈ మూసివేత చర్యలు తీసుకున్నట్లు మేయర్లటీ వెల్లడించింది. అగ్నిప్రమాదంపై జరిపిన దర్యాప్తులో అనేక ఉల్లంఘనలు జరిగినట్లు గుర్తించామని, ప్రధానంగా దుకాణాల వెలుపల సరుకులను ప్రదర్శించడం, ఉపయోగించిన దుస్తులను విక్రయించడం, అసంఘటిత పద్ధతిలో నిర్వహిస్తున్న స్టాల్స్ ద్వారా గడువు ముగిసిన ఆహార పదార్థాల ప్రదర్శనలు ఉన్నాయన్నారు.
9,000 చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న అల్-సవారిఖ్ మార్కెట్ కాంప్లెక్స్.. విభిన్న వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలలో పాల్గొనే 26 వాణిజ్య సముదాయాలను కలిగి ఉంది. మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, మార్కెట్లో విక్రయాల పరిమాణం సంవత్సరానికి $400 మిలియన్లకు చేరుకుంది.
తాజా వార్తలు
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- IPL 2026: ముంబై పై హైదరాబాద్ ఘన విజయం
- యూరప్ పర్యటనలో యూఏఈలో ప్రధాని మోదీ స్టాప్ఓవర్ చేసే అవకాశం
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- ఇనార్బిట్ మాల్ లో ‘మైఖేల్’ చిత్ర ప్రత్యేక ప్రదర్శన
- 1000 కోట్ల నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం!
- ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు..అధికారం ఆ పార్టీలదే...పీపుల్స్ పల్స్ సంచలన ఎగ్జిట్ పోల్స్
- రోడ్డు దాటుతుండగా వాహనం ఢీ..దుబాయ్ పోలీసుల హెచ్చరిక జారీ..!!
- FIFA U-17 ప్రపంచ కప్ ఖతార్ 2026 టోర్నమెంట్ తేదీల ప్రకటన..!!
- 6,640 విద్యుత్ కనెక్షన్ల తొలగింపు..సమీక్షకు ఎంపీ పిలుపు..!!









