ఆకాశంలో ఇంజన్ వైఫల్యం.. దుబాయ్కి మళ్లించిన ప్యాసింజన్ విమానం
- May 28, 2023
యూఏఈ: మిడ్-ఎయిర్ ఎమర్జెన్సీ నేపథ్యంలో బ్యాంకాక్ నుండి ఆమ్స్టర్డామ్కు వెళుతున్న KLM విమానాన్ని అత్యవసరంగా దుబాయ్ కి మళ్లించారు. ఫ్లైట్ KL876 - బోయింగ్ 777-200ER విమానం.. ఇరాన్ మీదుగా ఎగురుతున్న సమయంలో ఇంజన్ లో వైఫల్యం ఏర్పడట్టు పైలెట్లు గుర్తించారు. దీంతో సమీపంలో ఉన్న దుబాయ్ ఎయిర్ పోర్ట్ లో అత్యవసరంగా ల్యాండ్ కావాలని అధికారులు సూచించారు. దీంతో అత్యవసరంగా పైలట్ విమానాన్ని దుబాయ్లో ల్యాండ్ చేశాడు. విమానం రాగానే ఎమర్జెన్సీ టీమ్లు సహాయక చర్యలు చేపట్టాయి. విమానానికి ఎలాంటి ప్రమాదం జరుగపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఈ వారం ప్రారంభంలో వాతావరణ పరిస్థితుల కారణంగా మంగళూరు నుండి బెంగళూరుకు వెళ్లే దేశీయ భారతీయ విమానాన్ని దుబాయ్కి మళ్లించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మొత్తం 160 మంది ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
తాజా వార్తలు
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..
- హైదరాబాద్ హీరోస్కు రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్..విజేతలకు ట్రోఫీ అందించిన సీఎం రేవంత్
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక
- AIతో పార్కు డిజైన్ చేస్తే Dh200,000 బహుమతి..
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!







