తూర్పు జపాన్ లో భూకంపం: సౌదీ పౌరులు క్షేమం..!
- May 28, 2023
టోక్యో: తూర్పు జపాన్ను తాకిన భూకంపంలో సౌదీ పౌరులందరు క్షేమంగా ఉన్నారని, వారి భద్రతపై స్థానిక జపాన్ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని జపాన్లోని సౌదీ అరేబియా రాయబార కార్యాలయం తెలియజేసింది. విపత్తులకు సంబంధించి స్థానిక అధికారులు జారీ చేసిన సూచనలకు కట్టుబడి ఉండాలని రాయబార కార్యాలయం పౌరులకు పిలుపునిచ్చింది. ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే, సౌదీ పౌరులు తప్పనిసరిగా సౌదీ వ్యవహారాలను నంబర్ (09055833862) ద్వారా సంప్రదించాలని సూచించింది. NHK ప్రకారం.. టోక్యోకు తూర్పున ఉన్న చిబా ప్రిఫెక్చర్లో శుక్రవారం సాయంత్రం 7:03 గంటలకు 6.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. జపాన్ వాతావరణ సంస్థ సునామీ ముప్పు లేదని పేర్కొంది. అయితే భూకంప కేంద్రం చిబా తూర్పు తీరంలో, 50 కిలోమీటర్ల లోతులో ఉందని అంచనా వేసింది.
తాజా వార్తలు
- IPL-2026: సన్రైజర్స్ కొత్త కెప్టెన్గా ఇషాన్ కిషన్
- సగటు తలసరి ఇంటర్నెట్ డేటా వినియోగం గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- దుబాయ్ విమానయాన రంగం పునరుద్ధరణ పై సీఈఓ పాల్ గ్రిఫిత్స్ ధీమా!
- వాతావరణంలో రేడియేషన్ స్థాయిలపై కువైట్ క్లారిటీ..!!
- అల్పపీడన ద్రోణి..ఒమన్ వ్యాప్తంగా వర్షాలు..!!
- ప్రాంతీయ భద్రతపై రియాద్ లో కీలక సమావేశం..!!
- కువైట్ లో మార్చి 20న ఈద్ అల్-ఫితర్..!!
- ఖతార్ ఆహార భద్రతా వ్యవస్థ పటిష్ఠంగా ఉంది: ఫైసల్ అల్-థానీ
- ఈద్ అల్ ఫితర్: అబుదాబిలో 4 రోజుల పాటు ఉచిత పార్కింగ్..!!
- సున్నితమైన ఫోటోలు ఆన్లైన్లో పోస్ట్..కేసు నమోదు..!!









