తూర్పు జపాన్ లో భూకంపం: సౌదీ పౌరులు క్షేమం..!
- May 28, 2023
టోక్యో: తూర్పు జపాన్ను తాకిన భూకంపంలో సౌదీ పౌరులందరు క్షేమంగా ఉన్నారని, వారి భద్రతపై స్థానిక జపాన్ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని జపాన్లోని సౌదీ అరేబియా రాయబార కార్యాలయం తెలియజేసింది. విపత్తులకు సంబంధించి స్థానిక అధికారులు జారీ చేసిన సూచనలకు కట్టుబడి ఉండాలని రాయబార కార్యాలయం పౌరులకు పిలుపునిచ్చింది. ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే, సౌదీ పౌరులు తప్పనిసరిగా సౌదీ వ్యవహారాలను నంబర్ (09055833862) ద్వారా సంప్రదించాలని సూచించింది. NHK ప్రకారం.. టోక్యోకు తూర్పున ఉన్న చిబా ప్రిఫెక్చర్లో శుక్రవారం సాయంత్రం 7:03 గంటలకు 6.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. జపాన్ వాతావరణ సంస్థ సునామీ ముప్పు లేదని పేర్కొంది. అయితే భూకంప కేంద్రం చిబా తూర్పు తీరంలో, 50 కిలోమీటర్ల లోతులో ఉందని అంచనా వేసింది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







