తూర్పు జపాన్ లో భూకంపం: సౌదీ పౌరులు క్షేమం..!
- May 28, 2023
టోక్యో: తూర్పు జపాన్ను తాకిన భూకంపంలో సౌదీ పౌరులందరు క్షేమంగా ఉన్నారని, వారి భద్రతపై స్థానిక జపాన్ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని జపాన్లోని సౌదీ అరేబియా రాయబార కార్యాలయం తెలియజేసింది. విపత్తులకు సంబంధించి స్థానిక అధికారులు జారీ చేసిన సూచనలకు కట్టుబడి ఉండాలని రాయబార కార్యాలయం పౌరులకు పిలుపునిచ్చింది. ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే, సౌదీ పౌరులు తప్పనిసరిగా సౌదీ వ్యవహారాలను నంబర్ (09055833862) ద్వారా సంప్రదించాలని సూచించింది. NHK ప్రకారం.. టోక్యోకు తూర్పున ఉన్న చిబా ప్రిఫెక్చర్లో శుక్రవారం సాయంత్రం 7:03 గంటలకు 6.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. జపాన్ వాతావరణ సంస్థ సునామీ ముప్పు లేదని పేర్కొంది. అయితే భూకంప కేంద్రం చిబా తూర్పు తీరంలో, 50 కిలోమీటర్ల లోతులో ఉందని అంచనా వేసింది.
తాజా వార్తలు
- భూకంపంలో స్టార్ ప్లేయర్ భార్య, ఇద్దరు పిల్లలు మృతి!
- వ్యక్తి వయస్సును ఒక సంవత్సరం తగ్గించిన కోర్టు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై సౌదీ క్రౌన్ ప్రిన్స్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ చర్చలు..!!
- అభిమానుల నిద్రవేళలను తిరగరాస్తోన్న ఫుట్ బాల్ ప్రపంచ కప్ ఫీవర్..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఫ్లైట్ టిక్కెట్ ధరల్లో భారీగా వ్యత్యాసాలు..!!
- లూసైల్ ట్రామ్ నిలిపివేతతో ప్రభావితమైన ప్రాంతాలకు కొత్త మెట్రోలింక్..!!
- జూలై 3 నుండి కువైట్లో సమ్మర్ హాటెస్ట్ సీజన్ ప్రారంభం..!!
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..
- హైదరాబాద్ హీరోస్కు రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్..విజేతలకు ట్రోఫీ అందించిన సీఎం రేవంత్







