విద్యార్థికి విద్యుత్ గాయం.. జాజాన్ పాఠశాల నిర్లక్ష్యమే కారణమని పేరెంట్స్ ఆరోపణ
- May 29, 2023
జజాన్: దక్షిణ జజాన్ ప్రాంతంలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థి.. పాఠశాల వ్యాయామశాలలో ఉండగా విద్యుత్ షాక్ తగిలి తీవ్ర గాయాలకు గురయ్యాడు. విద్యార్థి సత్తం ఫకీహ్ పరిస్థితి విషమించడంతో కోమాలోకి వెళ్లాడు. జాజాన్లోని ప్రిన్స్ ముహమ్మద్ బిన్ నాసర్ హాస్పిటల్లోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స పొందుతున్నాడు. ఇదిలా ఉండగా.. సకాలంలో ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం అందించడంలో పాఠశాల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విద్యార్థిని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ప్రమాదం గురించి కుటుంబీకులకు తెలియజేయడంలో పాఠశాల అధికారులు విఫలమయ్యారని, ఆసుపత్రికి తీసుకెళ్లడంలో ఆలస్యం చేశారని వారు ఫిర్యాదు చేశారు. విద్యార్థి ఘటన సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ కాగా, విద్యార్థి పరిస్థితికి సంబంధించి నిర్లక్ష్యానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చాలా మంది నెటిజన్లు విద్యా అధికారులను కోరుతున్నారు.
సత్తం జజాన్లోని అబూ అరిష్ ఎడ్యుకేషన్ ఆఫీస్ కింద ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నాడు. కుటుంబ సభ్యుల ప్రకారం.. పాఠశాల వ్యాయామశాలలో తన శారీరక విద్య సెషన్కు హాజరవుతున్నప్పుడు వాటర్ లీకేజీ కారణంగా కప్బోర్డ్ ఎయిర్ కండీషనర్ను టచ్ చేసిన సమయంలో విద్యార్థికి గాయాలయ్యాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో విద్యార్థి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. పాఠశాలలో హెల్త్ గైడ్ ఉన్నప్పటికీ బాలుడికి తక్షణ వైద్య సహాయం అందించేందుకు పాఠశాల అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని కుటుంబీకులు వాపోయారు. కానీ వారు గాయపడిన విద్యార్థి సోదరుడిని పిలిపించారని, అతను తన కారులో ఆసుపత్రికి తీసుకెళ్లాడని వివరించారు. సత్తం సోదరుడు అదే పాఠశాలలో ఇంటర్మీడియట్ మూడో తరగతి చదువుతున్నాడు. ఆసుపత్రికి వెళుతుండగా అతని సోదరుడి కారులో మంటలు చెలరేగాయని తెలిపారు.
ప్రమాదం జరిగిన సమయంలో పాఠశాల అధికారులు విద్యార్థి సంరక్షకుడికి తెలియజేయలేదని, వ్యాయామశాలలో విద్యుత్ లోపం గురించి పాఠశాల అధికారులకు తెలిసినప్పటికీ ఎటువంటి భద్రత, నివారణ చర్యలు తీసుకోలేదని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. గాయపడిన తమ కొడుకు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స పొందుతున్నాడని, అతని పరిస్థితి విషమంగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. బాలుడికి ప్రథమ చికిత్స అందించడంలో ఆలస్యం చేయడంతో విద్యార్థి పరిస్థితి విషమంగా మారిందని ఆరోపించారు. ఈ ఘటనపై జజాన్ ప్రాంతంలోని జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రతినిధి రాజా అల్-అట్టాస్ మాట్లాడుతూ.. ఈ ఘటనపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని రీజియన్లోని డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









