అస్సాంలో తొలి వందే భారత్ ఎక్స్ప్రెస్ను జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని
- May 29, 2023
న్యూఢిల్లీ: ఈశాన్య ప్రాంతంలో మొట్టమొదటిసారిగా గువాహటి-న్యూ జల్పైగురి మార్గంలో ప్రధాని మోడీ వందే భారత్ ఎక్స్ప్రెస్ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జెండా ఊపి ప్రారంభించారు. మొదటి ఈశాన్య వందే భారత్ రైలును ప్రారంభించడం వల్ల పర్యాటక రంగానికి ఊతమిస్తుందని, ఈశాన్య ప్రాంతాలలో కనెక్టివిటీని పెంచుతుందని భావిస్తున్నామని ప్రధాని మోడీ ఈ సందర్భంగా అన్నారు. 2016లో రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రాకముందు అభివృద్ధి శూన్యంగా ఉండేదని చెప్పారు.
ఈ రైలు గౌహతి -న్యూ జల్పాయిగురి మధ్య 411 కి.మీ దూర రైలు ప్రయాణాన్ని 5 గంటల 30 నిమిషాల్లో కవర్ చేస్తుంది. ఇది అత్యంత వేగవంతమైన రైలు. ఇది ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించనుంది. వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు సర్వీస్ వారానికి ఆరు రోజులు నడుపుతామని రైల్వే అధికారులు చెప్పారు. వందే భారత్ ఎక్స్ప్రెస్లోని ఎగ్జిక్యూటివ్ చైర్ కారు ఒక్కొక్కటి 52 సీటింగ్ కెపాసిటీని కలిగి ఉన్నాయి.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







