అస్సాంలో తొలి వందే భారత్ ఎక్స్ప్రెస్ను జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని
- May 29, 2023న్యూఢిల్లీ: ఈశాన్య ప్రాంతంలో మొట్టమొదటిసారిగా గువాహటి-న్యూ జల్పైగురి మార్గంలో ప్రధాని మోడీ వందే భారత్ ఎక్స్ప్రెస్ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జెండా ఊపి ప్రారంభించారు. మొదటి ఈశాన్య వందే భారత్ రైలును ప్రారంభించడం వల్ల పర్యాటక రంగానికి ఊతమిస్తుందని, ఈశాన్య ప్రాంతాలలో కనెక్టివిటీని పెంచుతుందని భావిస్తున్నామని ప్రధాని మోడీ ఈ సందర్భంగా అన్నారు. 2016లో రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రాకముందు అభివృద్ధి శూన్యంగా ఉండేదని చెప్పారు.
ఈ రైలు గౌహతి -న్యూ జల్పాయిగురి మధ్య 411 కి.మీ దూర రైలు ప్రయాణాన్ని 5 గంటల 30 నిమిషాల్లో కవర్ చేస్తుంది. ఇది అత్యంత వేగవంతమైన రైలు. ఇది ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించనుంది. వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు సర్వీస్ వారానికి ఆరు రోజులు నడుపుతామని రైల్వే అధికారులు చెప్పారు. వందే భారత్ ఎక్స్ప్రెస్లోని ఎగ్జిక్యూటివ్ చైర్ కారు ఒక్కొక్కటి 52 సీటింగ్ కెపాసిటీని కలిగి ఉన్నాయి.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ