ఘోర రైలు ప్రమాదం...50 మంది మృతి
- June 02, 2023
ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. కోరమాండల్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 50మంది మరణించారు. 400 మందికిపైగా గాయపడ్డారు.
షాలిమార్ (కోల్ కతా) నుంచి చెన్నై వెళ్తున్న కోరమాండల్ ఎక్స్ ప్రెస్ (12841).. ఒడిశా బాలాసోర్ సమీపంలోని బహనాగా రైల్వే స్టేషన్ లో ఆగి ఉన్న గూడ్స్ రైలుని ఢీకొట్టి పట్టాలు తప్పింది. అదే సమయంలో పక్క ట్రాక్ లో వెళ్తున్న యశ్వంత్ పూర్-హౌరా ట్రైన్ (బెంగళూరు నుంచి కోల్ కతా వెళ్తోంది) కోరమాండల్ ట్రైన్ బోగీలను ఢీకొడుతూ వెళ్లిపోయింది. ఆ రైలు బోగీలు కూడా పట్టాలు తప్పాయి.
దీంతో ఘోరం జరిగిపోయింది. మరో రైలు ఢీకొట్టడంతో ఏడు బోగీలు బోల్తాపడ్డాయి. ఈ ఘటనలో ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. బోగీల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాగా, ఈ ప్రమాదంలో మృతులు, గాయపడిన వారి సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
ఈ ఘోర రైలు ప్రమాద ఘటనపై కేంద్రం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు చొప్పున ఎక్స్ గ్రేషియా అనౌన్స్ చేసింది కేంద్రం. ఇక తీవ్రంగా గాయపడిన వారికి రూ.2లక్షల, గాయపడిన వారికి రూ.50వేలు ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. ఈ యాక్సిడెంట్ లో 7 బోగీలు బోల్తా పడ్డాయి. వాటి కింద ప్రయాణికులు చిక్కుకుపోయారు. శుక్రవారం రాత్రి 7.20 గంటలకు ఈ దుర్ఘటన జరిగింది.
మూడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, 4 ఒడిశా విపత్తు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బృందాలు, 15 ఫైర్ రెస్క్యూ టీమ్స్, 30మంది డాక్టర్లు, 200 మంది పోలీసులు, 60 అంబులెన్సులను ప్రమాద స్థలానికి పంపించారు. సహాయక కార్యక్రమాలు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. స్థానికులు కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- కోరమాండల్ కాకినాడ ప్లాంట్కు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు
- ఇఫ్తార్ విందులో సీఎం చంద్రబాబు...
- Oscars 2026 winners : ఆస్కార్ అవార్డ్స్ 2026, విజేతల పూర్తి వివరాలు
- ఐపీఎల్ 2026: 10 జట్ల కెప్టెన్ల వివరాలు ఇవే!
- సినీ నటి ప్రత్యూష ఆత్మహత్య కేసు..కోర్టులో లొంగిపోయిన సిద్ధార్ధ రెడ్డి
- అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహం..
- ఫుజైరా పెట్రోలియం కేంద్రం పై డ్రోన్ దాడి: అదుపులో మంటలు..
- జెడ్డా ఎఫ్1 గ్రాండ్ ప్రిక్స్ వాయిదా..!!
- ఈద్ సెలవులలో భద్రతా చర్యలు పాటించాలి: ROP
- డెలివరీ ప్లాట్ఫామ్లలో పొగాకు, సిగరెట్ల అమ్మకాల పై నిషేధం..!!









