భారీ ఇసుక తుఫాను.. ఒకరి మృతి, 5 మందికి గాయాలు
- June 03, 2023
యూఏఈ: ఈజిప్ట్ రాజధానిని విధ్వంసకర ఇసుక తుఫాను అస్తవ్యస్తం చేసింది. ప్రధాన రహదారిలో బిల్బోర్డ్ కూలిన ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ఐదుగురు గాయపడ్డారని స్థానిక మీడియా తెలిపింది. 20 మిలియన్ల జనాభా ఉన్న కైరో పట్టణం తుఫాను కారణంగా తీవ్రంగా నష్టపోయిందని పేర్కొన్నారు. ఇసుక తుఫాన్ కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సూయజ్ కెనాల్లోని ఓడలను చుట్టుముట్టే భయంకరమైన మేఘాలు, రోడ్లపై తుఫాన్ ధాటికి దృశ్యమానత దాదాపు సున్నాకి పడిపోవడం వీడియోలలో స్పష్టంగా కనిపించింది.
ఇసుక తుఫానులు వసంతకాలంలో ఈజిప్ట్ను క్రమం తప్పకుండా దెబ్బతీస్తాయని, శ్వాసకోశ సమస్యలను కలిగిస్తాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. తీవ్రమైన గాలులు, ఇసుక తుఫానుతో పాటు వచ్చే ఎత్తైన అలల కారణంగా అధికారులు సూయజ్ కెనాల్ వెంబడి రెండు ఓడరేవులను మూసివేశారు.
2021లో ఇదే విధమైన తుఫాను సమయంలో ఎవర్ గివెన్ అనే జెయింట్ కంటైనర్ షిప్ సూయజ్ కెనాల్ మధ్యలో నిలిచి వాణిజ్య నౌకలకు తీవ్రంగా నష్టం కలిగించిన విషయం తెలిసిందే. ఈజిప్ట్ అరబ్ ప్రపంచంలో అత్యధిక జనాభా(105 మిలియన్లు) కలిగిన దేశంగా ప్రఖ్యాతి చెందింది.
తాజా వార్తలు
- ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం..10 మంది రోగులు మృతి..
- టిటిడి విద్యాసంస్థల్లో ‘స్మార్ట్’ చదువులకు సీఎం చంద్రబాబు ఆదేశం
- దుబాయ్ ఎయిర్పోర్ట్ పరిసరాల్లో కీలక రహదారులు తాత్కాలికంగా మూసివేత!
- దుబాయ్ ఎయిర్పోర్ట్లో విమాన సర్వీసులు తాత్కాలికంగా నిలిపివేత!
- దుబాయ్ ఎయిర్పోర్ట్ సమీపంలో అగ్నిప్రమాదం
- యూఏఈలో పిల్లల భద్రతకు అగ్ర ప్రాధాన్యత..షేక్ మొహమ్మద్
- ఈద్ అల్-ఫితర్ సెలవులను ప్రకటించిన ఖతార్..!!
- ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి రంగం సిద్ధం
- పద్మ అవార్డుల కోసం నామినేషన్ల స్వీకరణ
- కేంద్రం సంచలనం..వాళ్లంతా గ్యాస్ సిలిండర్స్ వెనక్కి ఇచ్చేయాలి..









