భారీ ఇసుక తుఫాను.. ఒకరి మృతి, 5 మందికి గాయాలు
- June 03, 2023యూఏఈ: ఈజిప్ట్ రాజధానిని విధ్వంసకర ఇసుక తుఫాను అస్తవ్యస్తం చేసింది. ప్రధాన రహదారిలో బిల్బోర్డ్ కూలిన ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ఐదుగురు గాయపడ్డారని స్థానిక మీడియా తెలిపింది. 20 మిలియన్ల జనాభా ఉన్న కైరో పట్టణం తుఫాను కారణంగా తీవ్రంగా నష్టపోయిందని పేర్కొన్నారు. ఇసుక తుఫాన్ కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సూయజ్ కెనాల్లోని ఓడలను చుట్టుముట్టే భయంకరమైన మేఘాలు, రోడ్లపై తుఫాన్ ధాటికి దృశ్యమానత దాదాపు సున్నాకి పడిపోవడం వీడియోలలో స్పష్టంగా కనిపించింది.
ఇసుక తుఫానులు వసంతకాలంలో ఈజిప్ట్ను క్రమం తప్పకుండా దెబ్బతీస్తాయని, శ్వాసకోశ సమస్యలను కలిగిస్తాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. తీవ్రమైన గాలులు, ఇసుక తుఫానుతో పాటు వచ్చే ఎత్తైన అలల కారణంగా అధికారులు సూయజ్ కెనాల్ వెంబడి రెండు ఓడరేవులను మూసివేశారు.
2021లో ఇదే విధమైన తుఫాను సమయంలో ఎవర్ గివెన్ అనే జెయింట్ కంటైనర్ షిప్ సూయజ్ కెనాల్ మధ్యలో నిలిచి వాణిజ్య నౌకలకు తీవ్రంగా నష్టం కలిగించిన విషయం తెలిసిందే. ఈజిప్ట్ అరబ్ ప్రపంచంలో అత్యధిక జనాభా(105 మిలియన్లు) కలిగిన దేశంగా ప్రఖ్యాతి చెందింది.
తాజా వార్తలు
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు