బహిరంగ ప్రదేశాల్లో పక్షులు, జంతువులకు ఆహారం అందిస్తే BD300 జరిమానా
- June 06, 2023
బహ్రెయిన్: ముహరక్ మునిసిపల్ కౌన్సిల్ మార్గదర్శకత్వంలో వీధులు మరియు బహిరంగ ప్రదేశాల్లో జంతువులకు ఆహారం ఇచ్చే వ్యక్తులకు జరిమానా విధించే ప్రచారాన్ని ముహరక్ మునిసిపాలిటీ ప్రారంభించింది. ముహరక్ మునిసిపల్ కౌన్సిల్ ప్రకారం.. బహిరంగ ప్రదేశాల్లో పక్షులు, జంతువులకు ఆహారం అందిస్తే BD300 జరిమానాను విధించనున్నారు. ప్రజల నుండి అనేక ఫిర్యాదులు వచ్చిన తర్వాత ఈ నిర్ణయంతీసుకున్నట్టు పేర్కొంది. బహిరంగ ప్రదేశాలలో పక్షులు మరియు జంతువులకు ఇచ్చే ఆహారం మిగిలి పాడై ఈగలు మరియు ఎలుకలు చేరి అనారోగ్యాన్ని కలిగిస్తాయని మున్సిపాలిటీ తెలిపింది. 2019 యొక్క పరిశుభ్రత చట్టం నంబర్ (10) ప్రకారం ఈ చర్యను ఎవరు చేసినా వారికి BD300 జరిమానా విధించబడుతుందని వెల్లడించింది.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







