బహిరంగ ప్రదేశాల్లో పక్షులు, జంతువులకు ఆహారం అందిస్తే BD300 జరిమానా
- June 06, 2023
బహ్రెయిన్: ముహరక్ మునిసిపల్ కౌన్సిల్ మార్గదర్శకత్వంలో వీధులు మరియు బహిరంగ ప్రదేశాల్లో జంతువులకు ఆహారం ఇచ్చే వ్యక్తులకు జరిమానా విధించే ప్రచారాన్ని ముహరక్ మునిసిపాలిటీ ప్రారంభించింది. ముహరక్ మునిసిపల్ కౌన్సిల్ ప్రకారం.. బహిరంగ ప్రదేశాల్లో పక్షులు, జంతువులకు ఆహారం అందిస్తే BD300 జరిమానాను విధించనున్నారు. ప్రజల నుండి అనేక ఫిర్యాదులు వచ్చిన తర్వాత ఈ నిర్ణయంతీసుకున్నట్టు పేర్కొంది. బహిరంగ ప్రదేశాలలో పక్షులు మరియు జంతువులకు ఇచ్చే ఆహారం మిగిలి పాడై ఈగలు మరియు ఎలుకలు చేరి అనారోగ్యాన్ని కలిగిస్తాయని మున్సిపాలిటీ తెలిపింది. 2019 యొక్క పరిశుభ్రత చట్టం నంబర్ (10) ప్రకారం ఈ చర్యను ఎవరు చేసినా వారికి BD300 జరిమానా విధించబడుతుందని వెల్లడించింది.
తాజా వార్తలు
- ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్ కన్నుమూత
- గల్ఫ్ దేశాలలో GTA 6 పై అధికారికంగా నిషేధం ఉందా?
- కువైట్ లో బంగ్లాదేశీ జాతీయుడు అరెస్టు..!!
- ఫ్రాన్స్ లో పర్యటించనున్న సుల్తాన్..!!
- సౌదీలో హెల్త్ కేర్ నిపుణుడి లైసెన్స్ సస్పెండ్..!!
- వెనిజులాకు ఖతార్ 'ఎయిర్ బ్రిడ్జ్' ఏర్పాటు..!!
- Dh1,00,000 గెలుచుకున్న నలుగురు భారతీయులు..!!
- జూలై 1 నుంచి 3 వరకు భారత్లో పర్యటించనున్న జపాన్ ప్రధాని
- మాదకద్రవ్యాల పై సమగ్ర యుద్ధం ప్రకటిద్దాం: తెలంగాణ పోలీస్
- ఒమాన్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాల హెచ్చరిక..







