'పీపుల్ ఫార్మసీ' పథకాన్ని పునరుద్ధరించిన లూలా
- June 09, 2023
బ్రసీలియా: బ్రెజిల్ అధ్యక్షుడు లూలా 'పీపుల్ ఫార్మసీ' ప్రభుత్వ పథకం కొత్త వెర్షన్ను బుధవారం ప్రవేశపెట్టారు. ప్రజలకు మందులను ఉచితంగా, తక్కువ ధరకు అందించనున్నట్లు ప్రకటించారు. చాలా మంది బ్రెజీలియన్లు ప్రిస్కిప్షన్ ఉన్నా మందులు కొనేందుకు డబ్బులేక చనిపోతున్నారని, ఇకపై తమ దేశంలో ఇలా జరగదని స్పష్టం చేశారు. పీపుల్స్ ఫార్మసీ ప్రజలందరి కోసం మరిన్ని మందులతో, ఎక్కువ మంది వైద్యులతో, ఫ్యామిలీ బ్యాగ్ ప్రోగ్రామ్తో తిరిగి వస్తోందని అన్నారు. ఈ పథకంతో 40 మందులను ఉచితంగా పొందే అవకాశం ఉంటుందని చెప్పారు. ఉచిత కేటగిరీతో పాటు ఇతర ఫార్మసీలలోని ధరలతో పోలిస్తే 90 శాతం వరకు తగ్గింపుతో మందులను అందించనున్నట్లు తెలిపారు. 2004లో లూలా మొదటిసారి బ్రెజిల్ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన సమయంలో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. డయాబెటిస్, ఆస్థమా, హైపర్ టెన్షన్ సహా 13 రకాల మందులను ప్రజలు ఉచితంగా పొందే అవకాశం కలిగించారు. అనంతరం బోల్సెనారో ప్రభుత్వం ఈ పథకం పరిధిని తగ్గించింది.
తాజా వార్తలు
- యూరప్ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్కు బదులుగా యూజర్నేమ్తో చాటింగ్
- ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- డూప్లికేట్ ఓట్ల పై TRS చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత







