బహ్రెయిన్ లో భారత రాయబారి పీయూష్ శ్రీవాస్తవకు ఘనంగా వీడ్కోలు
- June 09, 2023
బహ్రెయిన్: బహ్రెయిన్ సమగ్ర అభివృద్ధికి భారతీయ సమాజం చేసిన గణనీయమైన కృషిని క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి రాయల్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా ప్రశంసించారు. వివిధ రంగాలలో బహ్రెయిన్-భారత్ సంబంధాల నిరంతర వృద్ధికి సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, రెండు దేశాలు మరియు వారి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి సంబంధాలను మరింత బలోపేతం చేయవలసిన అవసరం ఉందని చెప్పారు. హెచ్ఆర్హెచ్ ప్రిన్స్ సల్మాన్ భారత రాయబారి పీయూష్ శ్రీవాస్తవకు ఘనంగా వీడ్కోలు పలికారు.
బహ్రెయిన్లో పీయూష్ శ్రీవాస్తవ పదవీకాలం ముగియడంతో మర్యాదపూర్వకంగా ప్రిన్స్ సల్మాన్ ను గుదైబియా ప్యాలెస్లో కలిసారు. ఈ సందర్భంగా బహ్రెయిన్-భారత్ సంబంధాలను బలోపేతం చేయడంలో శ్రీవాస్తవ పోషించిన ప్రశంసనీయమైన పాత్రకు ప్రిన్స్ సల్మాన్ ప్రశంసలు కురిపించారు. రాయబారి తన భవిష్యత్ బాధ్యతలలో విజయాన్ని కొనసాగించాలని ఆకాంక్షించారు.
అనంతరం ప్రిన్స్ సల్మాన్ కు రాయబారి పీయూష్ శ్రీవాస్తవ తన కృతజ్ఞతలు తెలిపారు. రెండు దేశాలలో పౌరుల సంక్షేమం కోసం బహ్రెయిన్-భారతదేశ సంబంధాలను పెంపొందించడంలో క్రౌన్ ప్రిన్స్ తిరుగులేని మద్దతు ఇచ్చారని ప్రశంసించారు.
బహ్రెయిన్కు తదుపరి రాయబారిగా శ్రీవాస్తవ స్థానంలో కేరళకు చెందిన వినోద్ కె. జాకబ్(2000 బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఆఫీసర్) ను నియమించారు. ఆయన ప్రస్తుతం శ్రీలంకలోని భారత హైకమిషన్లో డిప్యూటీ హైకమిషనర్గా విధులు నిర్వర్తిస్తున్నారు.
తాజా వార్తలు
- అబుదాబి నుంచి తొలి ఎతిహాద్ రైలు బయలుదేరింది
- అధునాతన పీడియాట్రిక్ అలర్జీ డయాగ్నస్టిక్ సేవలను ప్రారంభించిన HMC..!!
- ఆగస్టు 20 నుండి సింగిల్-యూజ్ ప్లాస్టిక్ బ్యాగుల పై బహ్రెయిన్ నిషేధం..!!
- హోర్ముజ్ జలసంధి పై ఒమన్-ఇరాన్ చర్చలు..!!
- యూఏఈలో స్ట్రాబెర్రీ మూన్ కనిపిస్తుందా?
- ఫహహీల్ ఎక్స్ప్రెస్వే పై అగ్నిప్రమాదం..!!
- సరిహద్దు భద్రతా చట్టాలను ఉల్లంఘించే వారికి సహకరిస్తే 15 ఏళ్ల జైలు శిక్ష..!!
- యూరప్ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్కు బదులుగా యూజర్నేమ్తో చాటింగ్
- ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..







