బహ్రెయిన్ లో భారత రాయబారి పీయూష్ శ్రీవాస్తవకు ఘనంగా వీడ్కోలు
- June 09, 2023
బహ్రెయిన్: బహ్రెయిన్ సమగ్ర అభివృద్ధికి భారతీయ సమాజం చేసిన గణనీయమైన కృషిని క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి రాయల్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా ప్రశంసించారు. వివిధ రంగాలలో బహ్రెయిన్-భారత్ సంబంధాల నిరంతర వృద్ధికి సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, రెండు దేశాలు మరియు వారి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి సంబంధాలను మరింత బలోపేతం చేయవలసిన అవసరం ఉందని చెప్పారు. హెచ్ఆర్హెచ్ ప్రిన్స్ సల్మాన్ భారత రాయబారి పీయూష్ శ్రీవాస్తవకు ఘనంగా వీడ్కోలు పలికారు.
బహ్రెయిన్లో పీయూష్ శ్రీవాస్తవ పదవీకాలం ముగియడంతో మర్యాదపూర్వకంగా ప్రిన్స్ సల్మాన్ ను గుదైబియా ప్యాలెస్లో కలిసారు. ఈ సందర్భంగా బహ్రెయిన్-భారత్ సంబంధాలను బలోపేతం చేయడంలో శ్రీవాస్తవ పోషించిన ప్రశంసనీయమైన పాత్రకు ప్రిన్స్ సల్మాన్ ప్రశంసలు కురిపించారు. రాయబారి తన భవిష్యత్ బాధ్యతలలో విజయాన్ని కొనసాగించాలని ఆకాంక్షించారు.
అనంతరం ప్రిన్స్ సల్మాన్ కు రాయబారి పీయూష్ శ్రీవాస్తవ తన కృతజ్ఞతలు తెలిపారు. రెండు దేశాలలో పౌరుల సంక్షేమం కోసం బహ్రెయిన్-భారతదేశ సంబంధాలను పెంపొందించడంలో క్రౌన్ ప్రిన్స్ తిరుగులేని మద్దతు ఇచ్చారని ప్రశంసించారు.
బహ్రెయిన్కు తదుపరి రాయబారిగా శ్రీవాస్తవ స్థానంలో కేరళకు చెందిన వినోద్ కె. జాకబ్(2000 బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఆఫీసర్) ను నియమించారు. ఆయన ప్రస్తుతం శ్రీలంకలోని భారత హైకమిషన్లో డిప్యూటీ హైకమిషనర్గా విధులు నిర్వర్తిస్తున్నారు.
తాజా వార్తలు
- విద్యే సాధికారతకు మూలం: గవర్నర్
- దుబాయ్ మెరినా టవర్ పై డ్రోన్ అవశేషాలు పడిన ఘటన
- దుబాయ్: అల్ బర్షాలో వాహనం పై శిథిలాలు పడి ఒకరు మృతి
- ఇరాన్ ఓ లూజర్.. చాలా తీవ్రంగా దెబ్బతింటుంది: డొనాల్డ్ ట్రంప్
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!









