రాయబార కార్యాలయంలో విధ్వంసం.. తీవ్రంగా ఖండించిన సౌదీ
- June 09, 2023
రియాద్: సుడాన్ రాజధాని ఖార్టూమ్లోని సౌదీ అరేబియా రాయబార కార్యాలయ భవనంలో కొన్ని సాయుధ గ్రూపులు జరిపిన విధ్వంసాన్ని సౌదీ అరేబియా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. రాయబార కార్యాలయంలో పనిచేస్తున్న సౌదీ సిబ్బంది నివాసాలు, ఆస్తులను ధ్వంసం చేయడంపై మంత్రిత్వ శాఖ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. దౌత్య కార్యకలాపాలు శాంతికి చిహ్నాలని, వాటిపై విధ్వంసక చర్యలు సరికావని హితవు చెప్పింది. సుడాన్ ప్రజల భద్రత, స్థిరత్వాన్ని అణగదొక్కడానికి ప్రయత్నిస్తున్న ఈ సాయుధ సమూహాలను ఎదుర్కోవాలన్న ప్రాముఖ్యతను కూడా ఇలాంటి సంఘటనలు చెబుతున్నాయని పేర్కొంది.
అలాగే బహ్రెయిన్ రాయబార కార్యాలయం ప్రధాన కార్యాలయం, సూడాన్ రాజధానిలోని రాయబారి ఇంటిపై సాయుధ బృందం దాడి చేసి ధ్వంసం చేసిన సంఘటనలపై బహ్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది. సైనిక కార్యకలాపాలను నిలిపివేయడానికి సౌదీ-అమెరికన్ చొరవ తీసుకోవాలని కోరింది. దేశంలో తిరిగి శాంతిని నెలకోల్పాలని సూడాన్ లోని పార్టీలకు మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







