రాయబార కార్యాలయంలో విధ్వంసం.. తీవ్రంగా ఖండించిన సౌదీ
- June 09, 2023
రియాద్: సుడాన్ రాజధాని ఖార్టూమ్లోని సౌదీ అరేబియా రాయబార కార్యాలయ భవనంలో కొన్ని సాయుధ గ్రూపులు జరిపిన విధ్వంసాన్ని సౌదీ అరేబియా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. రాయబార కార్యాలయంలో పనిచేస్తున్న సౌదీ సిబ్బంది నివాసాలు, ఆస్తులను ధ్వంసం చేయడంపై మంత్రిత్వ శాఖ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. దౌత్య కార్యకలాపాలు శాంతికి చిహ్నాలని, వాటిపై విధ్వంసక చర్యలు సరికావని హితవు చెప్పింది. సుడాన్ ప్రజల భద్రత, స్థిరత్వాన్ని అణగదొక్కడానికి ప్రయత్నిస్తున్న ఈ సాయుధ సమూహాలను ఎదుర్కోవాలన్న ప్రాముఖ్యతను కూడా ఇలాంటి సంఘటనలు చెబుతున్నాయని పేర్కొంది.
అలాగే బహ్రెయిన్ రాయబార కార్యాలయం ప్రధాన కార్యాలయం, సూడాన్ రాజధానిలోని రాయబారి ఇంటిపై సాయుధ బృందం దాడి చేసి ధ్వంసం చేసిన సంఘటనలపై బహ్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది. సైనిక కార్యకలాపాలను నిలిపివేయడానికి సౌదీ-అమెరికన్ చొరవ తీసుకోవాలని కోరింది. దేశంలో తిరిగి శాంతిని నెలకోల్పాలని సూడాన్ లోని పార్టీలకు మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- ఎతిహాద్ రైల్కు విశేష స్పందన.. తొలి ప్రయాణానికి ముందే 10 వేలకు పైగా టికెట్ల విక్రయం
- హిమాచల్ ప్రదేశ్ వరదలు..చిక్కుకుపోయిన 50 పర్యాటక వాహనాలు
- గ్రీస్లో UPIని ప్రారంభించిన భారత్
- ఒమాన్–ఫ్రాన్స్ మధ్య 12 కీలక ఒప్పందాలు.. మస్కట్ మెట్రో ప్రాజెక్టుకు ముందడుగు
- అబుదాబి నుంచి తొలి ఎతిహాద్ రైలు బయలుదేరింది
- అధునాతన పీడియాట్రిక్ అలర్జీ డయాగ్నస్టిక్ సేవలను ప్రారంభించిన HMC..!!
- ఆగస్టు 20 నుండి సింగిల్-యూజ్ ప్లాస్టిక్ బ్యాగుల పై బహ్రెయిన్ నిషేధం..!!
- హోర్ముజ్ జలసంధి పై ఒమన్-ఇరాన్ చర్చలు..!!
- యూఏఈలో స్ట్రాబెర్రీ మూన్ కనిపిస్తుందా?
- ఫహహీల్ ఎక్స్ప్రెస్వే పై అగ్నిప్రమాదం..!!







