RTA బస్సులో మహిళ ప్రసవం: తన అనుభవాలను తెలిపిన డ్రైవర్
- June 09, 2023
దుబాయ్: 41 ఏళ్ల ఈజిప్షియన్ బస్సు డ్రైవర్ మొహమ్మద్ ముస్తఫా.. 2007 నుండి పబ్లిక్ బస్సు డ్రైవర్గా సేవలు అందిస్తున్నాడు. జూన్ 7న దుబాయ్ నుండి అజ్మాన్కు డబుల్ డెక్కర్ ఇంటర్సిటీ బస్సును నడుపుతుండగా.. పై అంతస్తులో ప్రయాణీకుల నుండి అరుపులు వినిపించాయని ముస్తఫా తెలిపాడు. బస్సును ఆపి వెళ్లి చూడగా.. ఓ మహిళ ప్రసవ వేదనతో బాధపడుతుంది. వెంటనే ప్రయాణికులను ఖాళీ చేయమని చెప్పిన ముస్తఫా .. బస్ ఆపరేషనల్ కంట్రోల్ సెంటర్కు సమాచారం అందించాడు. ప్రయాణికులను వారి గమ్యస్థానానికి తీసుకెళ్లడానికి అంబులెన్స్తో పాటు మరో బస్సును పంపింది. మహిళ తనవెంట ఎవరూ లేరని గ్రహించి.. ఆమెకు ధైర్యం చెప్పాడు. ఆస్పత్రికి వెళ్లే వరకు అండగా నిలిచాడు. "ఆమె నా సోదరిలా అనిపించింది," అని ముస్తఫా అనంతరం స్పందించాడు. "నేను ఆమెను రిలాక్స్గా ఉంచేందుకు చేయగలిగినంత ప్రయత్నించాను. ఆమె మనస్సును శాంతపరచడానికి నేను ఆమెకు సానుకూల విషయాలను చెప్పాను. కొద్ది సమయంలో ఆస్పత్రి వస్తుందని ఆమెకు భరోసా ఇచ్చాను.’’ అని తన అనుభవాలను వివరించారు. "నా భార్య జన్మనివ్వడం నాకు గుర్తుంది. ఉన్న జ్ఞానంతో ప్రసవ వేదనను తగ్గించడానికి ఆమె శ్వాసను ఎలా నియంత్రించాలో నేను ఆమెకు శిక్షణ ఇచ్చాను" అని అతను చెప్పాడు. ఉగాండాకు చెందిన గర్భిణీ బుధవారం ఉదయం ఆర్టీఏ పబ్లిక్ బస్సు పై డెక్పై ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- మే నెలలో QR1.73 బిలియన్ల విలువైన రియల్ ఎస్టేట్ లావాదేవీలు..!!
- తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సర్వర్లు డౌన్!
- పుణే మర్డర్ కేసు..సియా గోయల్ సోదరుడికి రూ.10 కోట్లు జరిమానా
- 'ది గేమ్చేంజర్స్ మిడిల్ ఈస్ట్'కు భారీ స్పందన..1,500 స్టార్టప్ దరఖాస్తులు
- ఎతిహాద్ రైల్కు విశేష స్పందన.. తొలి ప్రయాణానికి ముందే 10 వేలకు పైగా టికెట్ల విక్రయం
- హిమాచల్ ప్రదేశ్ వరదలు..చిక్కుకుపోయిన 50 పర్యాటక వాహనాలు
- గ్రీస్లో UPIని ప్రారంభించిన భారత్
- ఒమాన్–ఫ్రాన్స్ మధ్య 12 కీలక ఒప్పందాలు.. మస్కట్ మెట్రో ప్రాజెక్టుకు ముందడుగు
- అబుదాబి నుంచి తొలి ఎతిహాద్ రైలు బయలుదేరింది
- అధునాతన పీడియాట్రిక్ అలర్జీ డయాగ్నస్టిక్ సేవలను ప్రారంభించిన HMC..!!







