హైదరాబాద్లో యూఏఈ కాన్సులేట్ జనరల్ ప్రారంభం
- June 15, 2023
హైదరాబాద్: హైదరాబాద్లో యూఏఈ కాన్సులేట్ జనరల్ను తెలంగాణ హోంశాఖ మంత్రి అహ్మద్ అలీ అల్ సయెగ్ ప్రారంభించారు. భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి వెల్లంవెల్లి మురళీధరన్తో పాటు పలువురు రాజకీయ అధికారులు, వ్యాపారవేత్తలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ముంబై, కేరళ కాన్సులేట్ల తర్వాత భారత్ లో యూఏఈ మూడవ కాన్సులేట్ హైదరాబాద్లో ప్రారంభం కావడం యూఏఈ-భారత్ మధ్య పెరుగుతున్న సంబంధాలను ప్రతిబింబిస్తుందని హిస్ ఎక్సలెన్సీ అల్ సయెగ్ తెలిపారు. అనేక దశాబ్దాలుగా చారిత్రక మూలాలను కలిగి ఉన్న ఇండియాతో సంబంధాన్ని బలోపేతం చేయడానికి యూఏఈ నిబద్ధతను కాన్సులేట్ ప్రారంభం తెలియజేస్తోందన్నారు. రెండు దేశాలు లోతైన ఆర్థిక, వాణిజ్యం, పెట్టుబడి సంబంధాలను కలిగి ఉన్నాయి. ఇది రెండు దేశాలలో స్థిరమైన అభివృద్ధికి తోడ్పడే విధంగా ఆర్థిక సంబంధాలను పెంపొందించడానికి కాన్సులేట్ ప్రారంభంతో ఇవి మరింత ముందుకు పోతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.


తాజా వార్తలు
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం
- అమెరికాతో సహా అగ్ర దేశాలకు భారత్ భారీ షాక్
- కింగ్ అబ్దుల్ అజీజ్ విమానాశ్రయంలో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఖతార్కు ఆసియా ఏనుగులను బహుమతిగా ఇచ్చిన నేపాల్..!!
- విలేజ్ ఆఫ్ హ్యాపీనెస్ కార్నివాల్ ప్రారంభం..!!
- దుబాయ్ లో విల్లా నుండి 18 ఏసీ యూనిట్లు చోరీ..!!
- కువైట్ లో తీవ్రంగా శ్రమించిన ఫైర్ ఫైటర్స్..!!
- రీసైకిల్ పదార్థాలతో క్రెడిట్ కార్డుల తయారీ..!!
- అమరావతికి మరో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే
- తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం







