హైదరాబాద్లో యూఏఈ కాన్సులేట్ జనరల్ ప్రారంభం
- June 15, 2023
హైదరాబాద్: హైదరాబాద్లో యూఏఈ కాన్సులేట్ జనరల్ను తెలంగాణ హోంశాఖ మంత్రి అహ్మద్ అలీ అల్ సయెగ్ ప్రారంభించారు. భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి వెల్లంవెల్లి మురళీధరన్తో పాటు పలువురు రాజకీయ అధికారులు, వ్యాపారవేత్తలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ముంబై, కేరళ కాన్సులేట్ల తర్వాత భారత్ లో యూఏఈ మూడవ కాన్సులేట్ హైదరాబాద్లో ప్రారంభం కావడం యూఏఈ-భారత్ మధ్య పెరుగుతున్న సంబంధాలను ప్రతిబింబిస్తుందని హిస్ ఎక్సలెన్సీ అల్ సయెగ్ తెలిపారు. అనేక దశాబ్దాలుగా చారిత్రక మూలాలను కలిగి ఉన్న ఇండియాతో సంబంధాన్ని బలోపేతం చేయడానికి యూఏఈ నిబద్ధతను కాన్సులేట్ ప్రారంభం తెలియజేస్తోందన్నారు. రెండు దేశాలు లోతైన ఆర్థిక, వాణిజ్యం, పెట్టుబడి సంబంధాలను కలిగి ఉన్నాయి. ఇది రెండు దేశాలలో స్థిరమైన అభివృద్ధికి తోడ్పడే విధంగా ఆర్థిక సంబంధాలను పెంపొందించడానికి కాన్సులేట్ ప్రారంభంతో ఇవి మరింత ముందుకు పోతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.


తాజా వార్తలు
- వాంఖడేలో సూర్య ప్రతాపం..అమెరికా పై భారత్ సంచలన విజయం
- ఇంటర్నేషనల్ బందర్ పోర్టు పనుల పరిశీలన చేసిన ఎంపీ బాలశౌరి
- జూబ్లీహిల్స్ వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు-షెడ్యూల్ ఇదే
- ఫిబ్రవరి 11న సెలవు ఇవ్వాలని SEC ఆదేశం
- సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు
- అమరావతి క్వాంటం వ్యాలీ శంకుస్థాపన
- వింటర్ ఒలింపిక్ 2026 ప్రారంభోత్సవం.. అమీర్ హాజరు..!!
- రికార్డులు బ్రేక్ చేసిన సౌదీ అరేబియా రైల్వే..!!
- దుబాయ్ స్కూళ్లలో రమదాన్ స్పెషల్ షెడ్యూల్..!!
- షేల్ ఆయిల్, గ్యాస్..అమెరికా సంస్థలతో కువైట్ చర్చలు..!!









