హైదరాబాద్లో యూఏఈ కాన్సులేట్ జనరల్ ప్రారంభం
- June 15, 2023
హైదరాబాద్: హైదరాబాద్లో యూఏఈ కాన్సులేట్ జనరల్ను తెలంగాణ హోంశాఖ మంత్రి అహ్మద్ అలీ అల్ సయెగ్ ప్రారంభించారు. భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి వెల్లంవెల్లి మురళీధరన్తో పాటు పలువురు రాజకీయ అధికారులు, వ్యాపారవేత్తలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ముంబై, కేరళ కాన్సులేట్ల తర్వాత భారత్ లో యూఏఈ మూడవ కాన్సులేట్ హైదరాబాద్లో ప్రారంభం కావడం యూఏఈ-భారత్ మధ్య పెరుగుతున్న సంబంధాలను ప్రతిబింబిస్తుందని హిస్ ఎక్సలెన్సీ అల్ సయెగ్ తెలిపారు. అనేక దశాబ్దాలుగా చారిత్రక మూలాలను కలిగి ఉన్న ఇండియాతో సంబంధాన్ని బలోపేతం చేయడానికి యూఏఈ నిబద్ధతను కాన్సులేట్ ప్రారంభం తెలియజేస్తోందన్నారు. రెండు దేశాలు లోతైన ఆర్థిక, వాణిజ్యం, పెట్టుబడి సంబంధాలను కలిగి ఉన్నాయి. ఇది రెండు దేశాలలో స్థిరమైన అభివృద్ధికి తోడ్పడే విధంగా ఆర్థిక సంబంధాలను పెంపొందించడానికి కాన్సులేట్ ప్రారంభంతో ఇవి మరింత ముందుకు పోతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.


తాజా వార్తలు
- ఈద్ అల్ అదా 2026 తేదీ ఖరారు చేసిన దేశాలు..
- అబుదాబి బరాకా అణు విద్యుత్ కేంద్రం వద్ద డ్రోన్ దాడి..అగ్నిప్రమాదం
- చిల్కూరు బాలాజీ ఆలయం పై అమెరికా సెనేటర్ అనుచిత వ్యాఖ్యలు
- విదేశీ నియామకాలను అధిగమించిన బహ్రెయిన్ ఉద్యోగాలు..!!
- జీసీసీ ‘వాఫెడ్’: ప్రవాస కార్మికులకు వైద్య పరీక్షలు..!!
- సౌదీలో 7రోజుల్లో 11,272 మంది నివాసితులు బహిష్కరణ..!!
- ఆన్లైన్ లో వ్యాఖ్యల పై యూఏఈ వార్నింగ్.. Dh500,000 ఫైన్..!!
- దోహా మెట్రోలో జర్నీ టూవర్డ్ హెల్త్ ఈవెంట్..!!
- ఒమన్ పాస్పోర్ట్ ర్యాంకింగ్ మెరుగు..!!
- ఎబోలాతో 88 మంది మృతి.. గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన WHO









