ఇండియా G20 సమావేశాలకు ఒమన్
- June 15, 2023
మస్కట్: 2023 సెప్టెంబర్ లో ఇండియా రాజధానిలో జరితే జి20 సమావేశాలలో పాల్గొంటున్నట్లు ఒమన్ ప్రకటించింది. ఈ మస్కట్లోని డిప్లమాటిక్ క్లబ్లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి తెలిపింది. G20 సమావేశాలు ప్రపంచ వృద్ధికి తోడ్పడే ఆర్థిక వ్యవస్థలతో అతిపెద్ద పారిశ్రామిక దేశాల కూటమి అని వాణిజ్యం, పరిశ్రమలు మరియు పెట్టుబడుల ప్రోత్సాహక మంత్రిత్వ శాఖ సలహాదారు, G20 సమావేశాల కోసం ఒమన్ సెక్రటేరియట్ అధిపతి పంకజ్ ఖిమ్జీ తెలిపారు. G20 సమావేశాలలో పాల్గొనడానికి ఒమన్కు భారతదేశం ప్రత్యేక ఆహ్వానం పంపిందని చెప్పారు. అంతర్జాతీయ సంఘంతో భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంతో పాటు, ప్రాంతీయ స్థాయిలో చురుకైన భాగస్వామిగా ఒమన్ స్థానాన్ని కూడా ఈ ఆహ్వానం పటిష్టపరుస్తుందని ఖిమ్జీ స్పష్టం చేశారు. పెట్టుబడి, అంతర్జాతీయ వాణిజ్యం, ఫైనాన్సింగ్ అందించడం ద్వారా చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలకు (SMEలు) మద్దతు ఇవ్వడం వంటి ప్రధాన సాధారణ సమస్యలను పరిష్కరించే G20 సమావేశాలలో ఒమన్ పాల్గొనడం ద్వారా అనేక ప్రయోజనాలను పొందుతుందని ఆయన తెలిపారు. G20 సమావేశాలలో ఒమన్ పాల్గొనడాన్ని పర్యవేక్షించడానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు ఖిమ్జీ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







