నిద్రమత్తులో డ్రైవింగ్.. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
- June 16, 2023
యూఏఈ: రోడ్డు పక్కన పనిచేస్తున్న ఎమిరాటీ వ్యక్తిని వేగంగా వస్తున్న వాహనం ఢీకొనడంతో మృతి చెందాడు. షార్జాలోని కల్బాలో బుధవారం ప్రమాదానికి దారితీసిన డ్రైవర్ నిద్రమత్తులో డ్రైవింగ్ చేశాడని దర్యాప్తులో తేలింది. ఈస్టర్న్ రీజియన్ పోలీస్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ కల్నల్ డాక్టర్ అలీ అల్ కే అల్ హమౌడీ మాట్లాడుతూ.. పెట్రోలింగ్లు, పారామెడిక్స్ బాధితుడిని ఆసుపత్రికి తరలించినప్పటికీ, అతను చికిత్స పొందుతూ మరణించాడు. మృతుడి వయస్సు 38 సంవత్సరాలు అని పేర్కొన్నారు. బాధితుడు ఎమిరాటీ కల్బా మునిసిపాలిటీలో పనిచేస్తాడని, తన అధికారిక విధుల్లో భాగంగా అతను వాడి అల్ హెలోలో రోడ్డు పక్కన తన వాహనాన్ని పార్క్ చేసి, బయటకు వెళ్లి తన పనిని చేస్తుండగా వేగంగా వచ్చిన కారు బాధితుడిని ఢీకొట్టిందని చెప్పారు. పోలీసులు డ్రైవర్ను పబ్లిక్ ప్రాసిక్యూషన్కు తరలించినట్లు తెలిపారు. డ్రైవర్లకు అలసటగా అనిపిస్తే సురక్షిత ప్రాంతంలో ఆపి విశ్రాంతి తీసుకోవాలని కల్నల్ డాక్టర్ అల్ హమౌడీ సూచించారు.
తాజా వార్తలు
- ఒమన్ లో 25 శాతం పెరిగిన కూరగాయల ధరలు..!!
- బహ్రెయిన్-కువైట్ భద్రతా సహకారం బలోపేతం..!!
- పిరికిపంద ఉగ్రవాద దాడి..ఐఏఈఏ చీఫ్ తో యూఏఈ విదేశాంగ మంత్రి..!!
- హజ్ వీసా గడువు దాటితే.. ఫైన్స్, జైలు శిక్ష, బహిష్కరణ..సౌదీ వార్నింగ్..!!
- ఖతార్ డిస్ట్రిక్ట్ కూలింగ్ సేవలపై నియంత్రణకు గైడ్ లైన్స్ జారీ..!!
- ‘అస్హాల్’ పోర్టల్ లో పార్టనర్ వర్క్ పర్మిట్ రెన్యువల్ సర్వీస్..!!
- IPL 2026: రాజస్థాన్ రాయల్స్ పై ఢిల్లీ క్యాప్టిల్స్ ఘన విజయం..
- ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత పౌర పురస్కారం..
- యాదగిరిగుట్ట వేద పాఠశాల శంకుస్థాపనకు సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం
- దేశంలో ఎడ్యు కేషన్ సిస్టమ్ పై రాహుల్ కీలక వ్యాఖ్యలు









