నిద్రమత్తులో డ్రైవింగ్.. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
- June 16, 2023
యూఏఈ: రోడ్డు పక్కన పనిచేస్తున్న ఎమిరాటీ వ్యక్తిని వేగంగా వస్తున్న వాహనం ఢీకొనడంతో మృతి చెందాడు. షార్జాలోని కల్బాలో బుధవారం ప్రమాదానికి దారితీసిన డ్రైవర్ నిద్రమత్తులో డ్రైవింగ్ చేశాడని దర్యాప్తులో తేలింది. ఈస్టర్న్ రీజియన్ పోలీస్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ కల్నల్ డాక్టర్ అలీ అల్ కే అల్ హమౌడీ మాట్లాడుతూ.. పెట్రోలింగ్లు, పారామెడిక్స్ బాధితుడిని ఆసుపత్రికి తరలించినప్పటికీ, అతను చికిత్స పొందుతూ మరణించాడు. మృతుడి వయస్సు 38 సంవత్సరాలు అని పేర్కొన్నారు. బాధితుడు ఎమిరాటీ కల్బా మునిసిపాలిటీలో పనిచేస్తాడని, తన అధికారిక విధుల్లో భాగంగా అతను వాడి అల్ హెలోలో రోడ్డు పక్కన తన వాహనాన్ని పార్క్ చేసి, బయటకు వెళ్లి తన పనిని చేస్తుండగా వేగంగా వచ్చిన కారు బాధితుడిని ఢీకొట్టిందని చెప్పారు. పోలీసులు డ్రైవర్ను పబ్లిక్ ప్రాసిక్యూషన్కు తరలించినట్లు తెలిపారు. డ్రైవర్లకు అలసటగా అనిపిస్తే సురక్షిత ప్రాంతంలో ఆపి విశ్రాంతి తీసుకోవాలని కల్నల్ డాక్టర్ అల్ హమౌడీ సూచించారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి