నిద్రమత్తులో డ్రైవింగ్.. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
- June 16, 2023
యూఏఈ: రోడ్డు పక్కన పనిచేస్తున్న ఎమిరాటీ వ్యక్తిని వేగంగా వస్తున్న వాహనం ఢీకొనడంతో మృతి చెందాడు. షార్జాలోని కల్బాలో బుధవారం ప్రమాదానికి దారితీసిన డ్రైవర్ నిద్రమత్తులో డ్రైవింగ్ చేశాడని దర్యాప్తులో తేలింది. ఈస్టర్న్ రీజియన్ పోలీస్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ కల్నల్ డాక్టర్ అలీ అల్ కే అల్ హమౌడీ మాట్లాడుతూ.. పెట్రోలింగ్లు, పారామెడిక్స్ బాధితుడిని ఆసుపత్రికి తరలించినప్పటికీ, అతను చికిత్స పొందుతూ మరణించాడు. మృతుడి వయస్సు 38 సంవత్సరాలు అని పేర్కొన్నారు. బాధితుడు ఎమిరాటీ కల్బా మునిసిపాలిటీలో పనిచేస్తాడని, తన అధికారిక విధుల్లో భాగంగా అతను వాడి అల్ హెలోలో రోడ్డు పక్కన తన వాహనాన్ని పార్క్ చేసి, బయటకు వెళ్లి తన పనిని చేస్తుండగా వేగంగా వచ్చిన కారు బాధితుడిని ఢీకొట్టిందని చెప్పారు. పోలీసులు డ్రైవర్ను పబ్లిక్ ప్రాసిక్యూషన్కు తరలించినట్లు తెలిపారు. డ్రైవర్లకు అలసటగా అనిపిస్తే సురక్షిత ప్రాంతంలో ఆపి విశ్రాంతి తీసుకోవాలని కల్నల్ డాక్టర్ అల్ హమౌడీ సూచించారు.
తాజా వార్తలు
- సివిలియన్ రక్షణ పై ఫోకస్..!!
- ప్రపంచవ్యాప్తంగా మూడో స్థానంలో జెద్దా ఎయిర్పోర్ట్..!!
- భారీ వర్షాలు..నీట మునిగిన ఇళ్లు, కార్లు..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు, షువైఖ్ పోర్టుల పై అటాక్స్..!!
- ఖతార్, కువైట్, బహ్రెయిన్ అంతటా సెక్యూరిటీ అలెర్ట్స్ జారీ..!!
- ధోఫార్లో పోలీస్ ఏవియేషన్ రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్..!!
- అయోధ్యలో బాలరాముడి నుదుట మెరిసిన ‘సూర్య తిలకం’
- భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన సిపి సజ్జనర్
- ఢిల్లీలో బంగారు బాబు గోల్డ్ అంతా సీజ్…
- భద్రాద్రిలో సీతారాముల కల్యాణ వైభవం: పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్









