నిద్రమత్తులో డ్రైవింగ్.. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
- June 16, 2023
యూఏఈ: రోడ్డు పక్కన పనిచేస్తున్న ఎమిరాటీ వ్యక్తిని వేగంగా వస్తున్న వాహనం ఢీకొనడంతో మృతి చెందాడు. షార్జాలోని కల్బాలో బుధవారం ప్రమాదానికి దారితీసిన డ్రైవర్ నిద్రమత్తులో డ్రైవింగ్ చేశాడని దర్యాప్తులో తేలింది. ఈస్టర్న్ రీజియన్ పోలీస్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ కల్నల్ డాక్టర్ అలీ అల్ కే అల్ హమౌడీ మాట్లాడుతూ.. పెట్రోలింగ్లు, పారామెడిక్స్ బాధితుడిని ఆసుపత్రికి తరలించినప్పటికీ, అతను చికిత్స పొందుతూ మరణించాడు. మృతుడి వయస్సు 38 సంవత్సరాలు అని పేర్కొన్నారు. బాధితుడు ఎమిరాటీ కల్బా మునిసిపాలిటీలో పనిచేస్తాడని, తన అధికారిక విధుల్లో భాగంగా అతను వాడి అల్ హెలోలో రోడ్డు పక్కన తన వాహనాన్ని పార్క్ చేసి, బయటకు వెళ్లి తన పనిని చేస్తుండగా వేగంగా వచ్చిన కారు బాధితుడిని ఢీకొట్టిందని చెప్పారు. పోలీసులు డ్రైవర్ను పబ్లిక్ ప్రాసిక్యూషన్కు తరలించినట్లు తెలిపారు. డ్రైవర్లకు అలసటగా అనిపిస్తే సురక్షిత ప్రాంతంలో ఆపి విశ్రాంతి తీసుకోవాలని కల్నల్ డాక్టర్ అల్ హమౌడీ సూచించారు.
తాజా వార్తలు
- ఆసియా లాక్రోస్ గేమ్స్లో భారత్కు డబుల్ టైటిల్
- ప్రపంచంలోనే ప్రత్యేక నగరంగా అమరావతి
- జపాన్లో చరిత్ర సృష్టించిన సనాయే తకైచి
- టాప్ 10 గ్లోబల్ రెవెన్యూ కంపెనీలు వెల్లడి
- భారత్-మలేసియాల మధ్య పలు ఒప్పందాల పై సంతకాలు
- భారత భాషల కోసం ప్రత్యేక AI విప్లవం
- నేటి నుంచి గుణదల మేరీమాత ఉత్సవాలు
- ఖతార్ లో వెయ్యి వస్తువుల ధరలు తగ్గింపు..!!
- మస్కట్ లో INSV కౌండిన్యకు ఘనంగా వీడ్కోలు..!!
- 2025లో సౌదీలో రెమిటెన్స్ రికార్డు..15శాతం వృద్ధి..!!









