ఆసియా లాక్రోస్ గేమ్స్లో భారత్కు డబుల్ టైటిల్
- February 09, 2026
రియాద్: సౌదీ అరేబియా రాజధాని రియాద్లో నిర్వహించిన ఆసియా లాక్రోస్ గేమ్స్లో భారత్ అద్భుత ప్రదర్శన కనబరిచి పురుషులు మరియు మహిళల విభాగాల్లో టైటిళ్లు సాధించింది.ఈ రెండో ఎడిషన్ గేమ్స్లో భారత్, పాకిస్తాన్, ఇరాక్ మరియు ఆతిథ్య దేశం సౌదీ అరేబియా జట్లు పాల్గొనగా, లాక్రోస్ క్రీడకు ఆసియా ప్రాంతంలో పెరుగుతున్న ఆదరణను ఈ టోర్నీ ప్రతిబింబించింది.
పురుషుల ఫైనల్లో భారత్ 9–2 తేడాతో ఇరాక్ను ఓడించి స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. తెలంగాణకు చెందిన కెప్టెన్ టి. అనుదీప్ రెడ్డి నాయకత్వంలో భారత జట్టు అత్యుత్తమ ప్రదర్శన చూపిందని ఆయన తెలిపారు.డయాశంకర్ గామేటి ఐదు గోల్స్తో టాప్ స్కోరర్గా నిలవగా, ఖుమార్ రామ్ గామేటి మరియు నిషాంత్ నాగ్దా తలో రెండు గోల్స్ చేశారు. ఆశిష్ గోయట్ నాయకత్వంలో రక్షణ విభాగం చక్కటి సమన్వయంతో ఆడగా, గోల్కీపర్ నారాయణ్ లాల్ గామేటి కీలక సేవలు అందించారు. కర్నూలుకు చెందిన బెలగల్ హుస్సైన్సాబ్ కూడా భారత జట్టులో భాగంగా ఉన్నారు.
మహిళల విభాగ ఫైనల్లో కెప్టెన్ సునీత మీనా నాయకత్వంలోని భారత జట్టు పాకిస్తాన్పై 22–5 తేడాతో ఘన విజయం సాధించి చాంపియన్గా నిలిచింది.
భారత జట్ల విజయాన్ని పురస్కరించుకుని రియాద్లోని భారతీయ సమాజం ఘనంగా అభినందన కార్యక్రమం నిర్వహించింది. ప్రముఖ దాత డాక్టర్ ఇడ్రిస్ సలీం గౌర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్ డిప్లొమాట్ వై.కె.సబీర్తో పాటు శిహాబ్ కొట్టుకాడ్, ముజ్జమిల్ షేక్ వంటి ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ యువ క్రీడాకారులు అంతర్జాతీయ వేదిక పై భారత్కు గర్వకారణంగా నిలిచారని డాక్టర్ ఇడ్రిస్ అన్నారు. అలాగే, ఈ టోర్నీకి ఆతిథ్యం ఇవ్వడం ద్వారా వివిధ క్రీడలను ప్రోత్సహించడంలో మరియు దేశాల మధ్య క్రీడా సంబంధాలను బలోపేతం చేయడంలో సౌదీ అరేబియా పాత్రను స్పష్టంగా చూపిందని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- డ్రగ్స్ కుట్రను భగ్నం చేసిన యూఏఈ..24 మంది అరెస్టు..!!
- ట్రాఫిక్ ఫైన్ లపై అభ్యంతరం..ఇంకా 15 రోజులే గడువు: టీజీఏ
- ఒమన్ లో ఫేక్ మెడికల్ ఉత్పత్తులపై స్పెషల్ డ్రైవ్..!!
- కువైట్ లో అక్రమ వ్యాపారాలపై రైడ్స్..!!
- బహ్రెయిన్లో కొత్త ఇండోర్ క్రికెట్ అకాడమీ.. అన్ని సీజన్లలో శిక్షణ..!!
- హ్యూస్టన్లోని పౌరులను ప్రమత్తం చేసిన ఖతార్ కాన్సులేట్..!!
- వర్షాకాల సన్నద్ధత పై డీజీపీ సి.వి.ఆనంద్ సమీక్ష
- జీ7 సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భేటీ
- సోషల్ మీడియాలో నకిలీ బీమా ఆఫర్ల పై జాగ్రత్త
- వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. !









