మస్కట్ లో INSV కౌండిన్యకు ఘనంగా వీడ్కోలు..!!
- February 09, 2026
మస్కట్: భారత నావికాదళ సెయిలింగ్ నౌక (INSV) కౌండిన్యను మస్కట్ నుండి బయలుదేరింది. ఈ సందర్భంగా జెండా ఊపి ఘనంగా వీడ్కోలు పలికారు. ఇది ఉమ్మడి సముద్ర వారసత్వంతోపాటు ఇండియా- ఒమన్ దౌత్య భాగస్వామ్యానికి ప్రతీకగా నిలిచింది.
ఈ కార్యక్రమంలో ఒమన్ రాయల్ నేవీకి చెందిన కమోడోర్ అబ్దుల్లా అల్ హజ్రీ, విదేశాంగ మంత్రిత్వ శాఖలో మానవ వనరుల విభాగాధిపతి యూసఫ్ బిన్ ఇస్సా అల్-జాడ్జాలి, ఒమన్లో భారత రాయబారి జి.వి. శ్రీనివాస్ మరియు భారత నావికాదళ సెయిలింగ్ అసోసియేషన్ చైర్మన్ కమెండర్ అమిత్ శ్రీవాస్తవతోపాటు పెద్ద సంఖ్యలో భారత ప్రవాసులు పాల్గొన్నారు.
INSV కౌండిన్య పోర్బందర్ నుండి మస్కట్ వరకు తన చారిత్రాత్మక తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. ఈ ప్రయాణం రెండు దేశాలను చారిత్రాత్మకంగా సజీవ సముద్ర వారసత్వంతో తిరిగి కలుపిందని ఈ సందర్భంగా భారత,ఒమన్ అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం
- ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు కొత్త దిశ
- ఇరాన్ దాడుల్లో గాయపడిన వారి చికిత్సపై అబూదాబి పోలీస్ చీఫ్ సమీక్ష
- యూపీలో ఘోర పడవ ప్రమాదం..10 మంది మృతి
- కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!









