మస్కట్ లో INSV కౌండిన్యకు ఘనంగా వీడ్కోలు..!!
- February 09, 2026
మస్కట్: భారత నావికాదళ సెయిలింగ్ నౌక (INSV) కౌండిన్యను మస్కట్ నుండి బయలుదేరింది. ఈ సందర్భంగా జెండా ఊపి ఘనంగా వీడ్కోలు పలికారు. ఇది ఉమ్మడి సముద్ర వారసత్వంతోపాటు ఇండియా- ఒమన్ దౌత్య భాగస్వామ్యానికి ప్రతీకగా నిలిచింది.
ఈ కార్యక్రమంలో ఒమన్ రాయల్ నేవీకి చెందిన కమోడోర్ అబ్దుల్లా అల్ హజ్రీ, విదేశాంగ మంత్రిత్వ శాఖలో మానవ వనరుల విభాగాధిపతి యూసఫ్ బిన్ ఇస్సా అల్-జాడ్జాలి, ఒమన్లో భారత రాయబారి జి.వి. శ్రీనివాస్ మరియు భారత నావికాదళ సెయిలింగ్ అసోసియేషన్ చైర్మన్ కమెండర్ అమిత్ శ్రీవాస్తవతోపాటు పెద్ద సంఖ్యలో భారత ప్రవాసులు పాల్గొన్నారు.
INSV కౌండిన్య పోర్బందర్ నుండి మస్కట్ వరకు తన చారిత్రాత్మక తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. ఈ ప్రయాణం రెండు దేశాలను చారిత్రాత్మకంగా సజీవ సముద్ర వారసత్వంతో తిరిగి కలుపిందని ఈ సందర్భంగా భారత,ఒమన్ అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సౌదీలో స్పోర్ట్స్ సెంటర్స్ కు కొత్త నిబంధనలు..పెర్ఫర్మాన్స్ డ్రగ్స్ పై నిషేధం..!!
- ఖైదీలు తయారు చేసిన ఉత్పత్తుల విక్రయానికి 'Sooum' యాప్..!!
- ఇంటర్పోల్ వెతుకున్న బంగ్లాదేశ్ మాజీ పోలీస్ బాస్ యూఏఈలో అరెస్ట్..!!
- కువైట్లో వాహనం బోల్తా.. అగ్నిప్రమాదానికి గురై ఇద్దరు మృతి..!!
- మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు గట్టి దెబ్బ..దుబాయ్ కస్టమ్స్..!!
- అవినీతి నిరోధక డైరెక్టరేట్కు ఐఎస్ఓ 9001 ధృవీకరణ..!!
- భారత నూతన రాయబారిగా ప్రశాంత్ పిసే బాధ్యతల స్వీకరణ..!!
- జేవాకింగ్ ప్రమాదాలపై అవగాహన కల్పించిన దుబాయ్ పోలీసులు
- దుబాయ్ ఎమిరేట్స్ రోడ్ ప్రమాదం: బాధితుల మృతదేహాలు భారత్, శ్రీలంకకు తరలింపు
- వర్షాలు, ప్రకృతి విపత్తుల పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష









