భారతీయ జంటను చంపిన వ్యక్తికి ఉరిశిక్ష ఖరారు

- June 16, 2023 , by Maagulf
భారతీయ జంటను చంపిన వ్యక్తికి ఉరిశిక్ష ఖరారు

యూఏఈ: దుబాయ్‌లోని కోర్ట్ ఆఫ్ కాసేషన్ భారతీయ జంటను చంపిన ఒక ఆసియా వ్యక్తికి విధించిన మరణశిక్షను సమర్థించింది. ఈ తీర్పును కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్‌స్టాన్స్ జారీ చేయగా.. అప్పీల్ కోర్ట్ సమర్థించింది. దుబాయ్‌లోని అరేబియా రాంచెస్ ప్రాంతంలోని బాధితుల విల్లాలోకి చొరబడి వ్యాపారవేత్త హిరేన్ అధియా, అతని భార్య విధి అధియాను చంపాడు. వారి కుమార్తెను కత్తితో పొడిచి.. 2,000 Dhs దొంగిలించిన కేసులో నిందితుడిని కోర్టు దోషిగా తేల్చింది.  భారతీయ దంపతులను చంపిన నిందితుడు గతంలోవారి ఇంట్లో పనిచేశాడని దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com