షార్జాలో భార్య, బిడ్డ ముందే వ్యక్తి ఆత్మహత్య
- June 17, 2023
షార్జా: షార్జాలోని అల్ నహ్దాలోని సహారా సెంటర్ సమీపంలో 35 ఏళ్ల ఆసియా వ్యక్తి వంతెనపై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. గత బుధవారం రాత్రి 9:00 గంటలకు షార్జా పోలీస్ జనరల్ కమాండ్ ఆపరేషన్స్ రూమ్కు సమాచారం అందిందని పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే, పోలీసు పెట్రోలింగ్ మరియు నేషనల్ అంబులెన్స్ సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. అక్కడ వ్యక్తిని వెంటనే అల్ ఖాసిమి ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ తీవ్ర గాయాల కారణంగా అతను మరణించాడు. మృతుడికి వివాహమై ఒక బిడ్డ కూడా ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ఘటన జరిగిన సమయంలో అతడు తన భార్య, బిడ్డతో కలిసి ఇంటికి వెళ్తున్నాడని పేర్కొన్నారు. భార్య వాంగ్మూలం ప్రకారం.. ఆమె భర్తకు ఉద్యోగం లేదని, దీంతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నాడని, వారు తమ బిడ్డతో అల్ నహ్దా పార్క్ నుండి ఇంటికి తిరిగి వస్తుండగా, అతను అకస్మాత్తుగా వంతెనపై పైనుండి క్రిందికి దూకినట్లు తెలిపింది. మరణించిన వ్యక్తి మృతదేహాన్ని అతని కుటుంబానికి అందించేందుకు చట్టపరమైన ప్రక్రియలను పూర్తి చేస్తున్నట్లు బుహైరా సమగ్ర పోలీస్ స్టేషన్ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఫైనల్ కి చేరుకున్న భారత్
- భారీ డిస్కౌంట్లు ప్రకటించిన ఎయిర్ ఇండియా
- లగ్జరీ కార్లకు కేరాఫ్ అడ్రస్గా రాయ్..అంతిమ యాత్రలోనూ దర్శనం
- బెలూన్స్ పేలి ఇద్దరికి గాయాలు
- తెలంగాణలో గృహాలకు ఫ్రీగా విద్యుత్ కనెక్షన్లు
- తెలంగాణ: మార్చి నెల 19న గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం
- మూడేళ్లలో వచ్చేది తమ ప్రభుత్వమే ! ధీమా వ్యక్తం చేసిన జగన్
- ఢిల్లీలో 15 రోజుల్లో 807 మంది అదృశ్యం
- ఖతార్ రాజధాని దోహాలో మంత్రి నారాయణ బృందం పర్యటన
- ఖతార్ లో క్లాస్రూమ్ రీడింగ్ బ్యాగ్ ప్రాజెక్ట్..!!







