షార్జాలో భార్య, బిడ్డ ముందే వ్యక్తి ఆత్మహత్య
- June 17, 2023
షార్జా: షార్జాలోని అల్ నహ్దాలోని సహారా సెంటర్ సమీపంలో 35 ఏళ్ల ఆసియా వ్యక్తి వంతెనపై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. గత బుధవారం రాత్రి 9:00 గంటలకు షార్జా పోలీస్ జనరల్ కమాండ్ ఆపరేషన్స్ రూమ్కు సమాచారం అందిందని పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే, పోలీసు పెట్రోలింగ్ మరియు నేషనల్ అంబులెన్స్ సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. అక్కడ వ్యక్తిని వెంటనే అల్ ఖాసిమి ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ తీవ్ర గాయాల కారణంగా అతను మరణించాడు. మృతుడికి వివాహమై ఒక బిడ్డ కూడా ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ఘటన జరిగిన సమయంలో అతడు తన భార్య, బిడ్డతో కలిసి ఇంటికి వెళ్తున్నాడని పేర్కొన్నారు. భార్య వాంగ్మూలం ప్రకారం.. ఆమె భర్తకు ఉద్యోగం లేదని, దీంతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నాడని, వారు తమ బిడ్డతో అల్ నహ్దా పార్క్ నుండి ఇంటికి తిరిగి వస్తుండగా, అతను అకస్మాత్తుగా వంతెనపై పైనుండి క్రిందికి దూకినట్లు తెలిపింది. మరణించిన వ్యక్తి మృతదేహాన్ని అతని కుటుంబానికి అందించేందుకు చట్టపరమైన ప్రక్రియలను పూర్తి చేస్తున్నట్లు బుహైరా సమగ్ర పోలీస్ స్టేషన్ వెల్లడించింది.
తాజా వార్తలు
- తెలంగాణ: బస్సులో సీటు దొరకట్లేదన్న దిగులు వద్దు..
- బ్రిటన్లో ఆరోగ్య రంగంలో నారాయణ హెల్త్ పెద్ద అడుగు!
- ఏపీకి పెట్టుబడుల వెల్లువ..
- ఎలక్ట్రిక్ యుగం వైపు ఏపీ—హిందూజా భాగస్వామ్యం!
- బస్సు ప్రమాదానికి 12 ప్రధాన కారణాలు ..
- పెట్టుబడులు సాధన లక్ష్యంగా దుబాయ్ లో పర్యటిస్తున్న మంత్రి నారాయణ
- రియాద్, తబుక్, మక్కా ప్రాంతాలలో సైరన్లు..!!
- వరల్డ్ సోషల్ డెవలప్ మెంట్ సమ్మిట్.. ట్రాఫిక్ ఆంక్షలు..!!
- ఖాసర్ అల్ హోస్న్లో జెండా ఎగురవేసిన యూఏఈ ప్రెసిడెంట్..!!
- కువైట్ లో ఇక క్యాష్ తో గోల్డ్ కొనలేరు..!!







