షార్జాలో భార్య, బిడ్డ ముందే వ్యక్తి ఆత్మహత్య
- June 17, 2023
షార్జా: షార్జాలోని అల్ నహ్దాలోని సహారా సెంటర్ సమీపంలో 35 ఏళ్ల ఆసియా వ్యక్తి వంతెనపై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. గత బుధవారం రాత్రి 9:00 గంటలకు షార్జా పోలీస్ జనరల్ కమాండ్ ఆపరేషన్స్ రూమ్కు సమాచారం అందిందని పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే, పోలీసు పెట్రోలింగ్ మరియు నేషనల్ అంబులెన్స్ సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. అక్కడ వ్యక్తిని వెంటనే అల్ ఖాసిమి ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ తీవ్ర గాయాల కారణంగా అతను మరణించాడు. మృతుడికి వివాహమై ఒక బిడ్డ కూడా ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ఘటన జరిగిన సమయంలో అతడు తన భార్య, బిడ్డతో కలిసి ఇంటికి వెళ్తున్నాడని పేర్కొన్నారు. భార్య వాంగ్మూలం ప్రకారం.. ఆమె భర్తకు ఉద్యోగం లేదని, దీంతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నాడని, వారు తమ బిడ్డతో అల్ నహ్దా పార్క్ నుండి ఇంటికి తిరిగి వస్తుండగా, అతను అకస్మాత్తుగా వంతెనపై పైనుండి క్రిందికి దూకినట్లు తెలిపింది. మరణించిన వ్యక్తి మృతదేహాన్ని అతని కుటుంబానికి అందించేందుకు చట్టపరమైన ప్రక్రియలను పూర్తి చేస్తున్నట్లు బుహైరా సమగ్ర పోలీస్ స్టేషన్ వెల్లడించింది.
తాజా వార్తలు
- మిడిలీస్టు ఉద్రిక్తతలతో చమురు ధరలు పెరుగుదల..గోల్డ్ ధరలు తగ్గుదల..!!
- ఖతార్ లో కార్మిక మంత్రిత్వ శాఖ ఈ-సేవలు కొనసాగింపు..!!
- కుటుంబ సభ్యుల పుట్టిన తేదీలతో.. Dh30 మిలియన్ల జాక్పాట్ కొట్టిన భారతీయ ప్రవాసి..!!
- కువైట్లో ప్రైవేట్ ఆస్పత్రుల్లో నగదు చెల్లింపులపై కొత్త నిబంధనలు..!!
- సౌదీలో విజిట్ వీసా గడువు దాటితే 50 వేల రియాల్స్ ఫైన్, జైలుశిక్ష..!!
- యూఏఈలో అమెరికా కాన్సులర్ సేవలునిలిపివేత..!!
- రాయల్ హ్యూమానిటేరియన్ ఫౌండేషన్ కు 25 ఏళ్లు..!!
- హైదరాబాద్ ఎయిర్పోర్ట్కు మరో అంతర్జాతీయ అవార్డు
- దమ్మామ్–రియాద్ ఎక్స్ప్రెస్వే విస్తరణకు శ్రీకారం..
- దుబాయ్ పోలీసుల 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం నాలుగో వారానికి చేరిక..







