షార్జాలో భార్య, బిడ్డ ముందే వ్యక్తి ఆత్మహత్య
- June 17, 2023
షార్జా: షార్జాలోని అల్ నహ్దాలోని సహారా సెంటర్ సమీపంలో 35 ఏళ్ల ఆసియా వ్యక్తి వంతెనపై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. గత బుధవారం రాత్రి 9:00 గంటలకు షార్జా పోలీస్ జనరల్ కమాండ్ ఆపరేషన్స్ రూమ్కు సమాచారం అందిందని పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే, పోలీసు పెట్రోలింగ్ మరియు నేషనల్ అంబులెన్స్ సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. అక్కడ వ్యక్తిని వెంటనే అల్ ఖాసిమి ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ తీవ్ర గాయాల కారణంగా అతను మరణించాడు. మృతుడికి వివాహమై ఒక బిడ్డ కూడా ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ఘటన జరిగిన సమయంలో అతడు తన భార్య, బిడ్డతో కలిసి ఇంటికి వెళ్తున్నాడని పేర్కొన్నారు. భార్య వాంగ్మూలం ప్రకారం.. ఆమె భర్తకు ఉద్యోగం లేదని, దీంతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నాడని, వారు తమ బిడ్డతో అల్ నహ్దా పార్క్ నుండి ఇంటికి తిరిగి వస్తుండగా, అతను అకస్మాత్తుగా వంతెనపై పైనుండి క్రిందికి దూకినట్లు తెలిపింది. మరణించిన వ్యక్తి మృతదేహాన్ని అతని కుటుంబానికి అందించేందుకు చట్టపరమైన ప్రక్రియలను పూర్తి చేస్తున్నట్లు బుహైరా సమగ్ర పోలీస్ స్టేషన్ వెల్లడించింది.
తాజా వార్తలు
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!
- ఉమ్ సలాల్ సెంట్రల్ మార్కెట్ లో మున్సిపల్ మినిస్టర్ తనిఖీలు..!!
- దుబాయ్-చైనా ఆర్థిక సంబంధాల విస్తరణపై చర్చలు..!!
- 24-గంటలపాటు ఫుడ్ హబ్ ప్రారంభం..!!
- 15 ఏళ్ల ప్రవాస బాలిక ఆచూకీ లభ్యం..!!
- భారీ వర్షాల నేపథ్యంలో సౌదీలో క్లాసులు రద్దు..!!
- గోల్డెన్ వీసా హోల్డర్లు విదేశాల నుంచి పని చేయవచ్చా?
- సౌదీ అరేబియాలో తెలుగు సమాఖ్య సేవా గాథ—నిరాశలో ఉన్న వ్యక్తికి కొత్త జీవితం









