బెలూన్స్ పేలి ఇద్దరికి గాయాలు
- February 04, 2026
ముంబై: ముంబైలో చోటుచేసుకున్న ఓ షాకింగ్ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. లిఫ్ట్లో తీసుకెళ్తున్న బెలూన్స్ ఒక్కసారిగా పేలిపోవడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన నగరంలోని ఓ బహుళ అంతస్తుల భవనంలో చోటు చేసుకుంది.ఈ ఘటన అందరినీ భయాందోళనకు గురి చేసింది. ఓ వ్యక్తి బెలూన్స్ను లిఫ్ట్లో తీసుకెళ్లడానికి ప్రయత్నించాడు. ఇంతలో ఒక్కసారిగా పేలి భారీగా మంటలు చెలరేగాయి. ఈ పేలుడు దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
సాధారణంగా బెలూన్లలో హీలియం గ్యాస్ నింపుతుంటారు. అయితే వాటికి మండే గుణం ఉండదు. హైడ్రోజన్ వంటి గ్యాస్ కు మాత్రమే ఈ స్థాయిలో మండే గుణం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మరి సదరు వ్యక్తి.. బెలూన్లలో ఏ గ్యాస్ ను నింపుకొని వచ్చాడో తెలియాల్సి ఉంది. అదే సమయంలో బెలూన్స్ ఒక్కసారిగా పేలిపోవడానికి గల కారణాలపై కూడా స్పష్టత రావాల్సి ఉంది.
తాజా వార్తలు
- ఫైనల్ కి చేరుకున్న భారత్
- భారీ డిస్కౌంట్లు ప్రకటించిన ఎయిర్ ఇండియా
- లగ్జరీ కార్లకు కేరాఫ్ అడ్రస్గా రాయ్..అంతిమ యాత్రలోనూ దర్శనం
- బెలూన్స్ పేలి ఇద్దరికి గాయాలు
- తెలంగాణలో గృహాలకు ఫ్రీగా విద్యుత్ కనెక్షన్లు
- తెలంగాణ: మార్చి నెల 19న గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం
- మూడేళ్లలో వచ్చేది తమ ప్రభుత్వమే ! ధీమా వ్యక్తం చేసిన జగన్
- ఢిల్లీలో 15 రోజుల్లో 807 మంది అదృశ్యం
- ఖతార్ రాజధాని దోహాలో మంత్రి నారాయణ బృందం పర్యటన
- ఖతార్ లో క్లాస్రూమ్ రీడింగ్ బ్యాగ్ ప్రాజెక్ట్..!!







