బెలూన్స్ పేలి ఇద్దరికి గాయాలు
- February 04, 2026
ముంబై: ముంబైలో చోటుచేసుకున్న ఓ షాకింగ్ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. లిఫ్ట్లో తీసుకెళ్తున్న బెలూన్స్ ఒక్కసారిగా పేలిపోవడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన నగరంలోని ఓ బహుళ అంతస్తుల భవనంలో చోటు చేసుకుంది.ఈ ఘటన అందరినీ భయాందోళనకు గురి చేసింది. ఓ వ్యక్తి బెలూన్స్ను లిఫ్ట్లో తీసుకెళ్లడానికి ప్రయత్నించాడు. ఇంతలో ఒక్కసారిగా పేలి భారీగా మంటలు చెలరేగాయి. ఈ పేలుడు దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
సాధారణంగా బెలూన్లలో హీలియం గ్యాస్ నింపుతుంటారు. అయితే వాటికి మండే గుణం ఉండదు. హైడ్రోజన్ వంటి గ్యాస్ కు మాత్రమే ఈ స్థాయిలో మండే గుణం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మరి సదరు వ్యక్తి.. బెలూన్లలో ఏ గ్యాస్ ను నింపుకొని వచ్చాడో తెలియాల్సి ఉంది. అదే సమయంలో బెలూన్స్ ఒక్కసారిగా పేలిపోవడానికి గల కారణాలపై కూడా స్పష్టత రావాల్సి ఉంది.
తాజా వార్తలు
- రంజాన్ సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు ప్రత్యేక వెసులుబాటు
- తిరుపతి నుండి గల్ఫ్ దేశాలకు విమాన సర్వీసులు నడపాలి: ఎంపీ రఘునాధరెడ్డి
- US ప్రతినిధుల సభలో H-1B వీసాల రద్దు బిల్లు
- మహిళలకు APSRTC శుభవార్త..
- ఆటో రంగంలో భారత్కు బిగ్ బూస్ట్, చైనాకు షాక్
- మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో..సైబరాబాద్ సీపీ దిశానిర్దేశం
- లోక్ భవన్లో గవర్నర్ను కలిసిన అసెంబ్లీ స్పీకర్
- మీడియా సిటీ ఖతార్.. 244 సంస్థలు ఆసక్తి..!!
- 46వ అల్బరాకా ఫోరమ్ ప్రారంభించిన మదీనా అమీర్..!!
- యూఏఈ మొట్టమొదటి రోడ్-రైల్ అంబులెన్స్..!!









