బెలూన్స్ పేలి ఇద్దరికి గాయాలు
- February 04, 2026
ముంబై: ముంబైలో చోటుచేసుకున్న ఓ షాకింగ్ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. లిఫ్ట్లో తీసుకెళ్తున్న బెలూన్స్ ఒక్కసారిగా పేలిపోవడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన నగరంలోని ఓ బహుళ అంతస్తుల భవనంలో చోటు చేసుకుంది.ఈ ఘటన అందరినీ భయాందోళనకు గురి చేసింది. ఓ వ్యక్తి బెలూన్స్ను లిఫ్ట్లో తీసుకెళ్లడానికి ప్రయత్నించాడు. ఇంతలో ఒక్కసారిగా పేలి భారీగా మంటలు చెలరేగాయి. ఈ పేలుడు దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
సాధారణంగా బెలూన్లలో హీలియం గ్యాస్ నింపుతుంటారు. అయితే వాటికి మండే గుణం ఉండదు. హైడ్రోజన్ వంటి గ్యాస్ కు మాత్రమే ఈ స్థాయిలో మండే గుణం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మరి సదరు వ్యక్తి.. బెలూన్లలో ఏ గ్యాస్ ను నింపుకొని వచ్చాడో తెలియాల్సి ఉంది. అదే సమయంలో బెలూన్స్ ఒక్కసారిగా పేలిపోవడానికి గల కారణాలపై కూడా స్పష్టత రావాల్సి ఉంది.
తాజా వార్తలు
- సోషల్ మీడియాకు KYC తప్పనిసరి..
- ఏపీ ప్రజలకు హెచ్చరిక..3 నెలలు తీవ్రమైన ఎండలు, వడగాలులు..
- లేపాక్షి రాయితీ అమ్మకాలకు విశేష స్పందన
- ఆయుష్మాన్ భారత్..రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స...
- వైజాగ్ ఆర్కే బీచ్లో కేఎఫ్సీ..ఇసుకతో భారీ ‘బకెట్’ ఆవిష్కరణ!
- మహిళా రిజర్వేషన్ల బిల్లులో ఓబీసీ సబ్ కోటా తప్పనిసరి: కల్వకుంట్ల కవిత
- యురేనియం నిల్వల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- ఇరాన్కు అమెరికా పలు కీలక ప్రతిపాదనలు..అందులో ఏమున్నాయంటే?
- ఈయూ పార్లమెంట్ అధ్యక్షురాలితో జీసీసీ రాయబారులు భేటీ..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్ళు..హెచ్చరికలు జారీ..!!









