ఫైనల్ కి చేరుకున్న భారత్
- February 05, 2026
ఐసీసీ అండర్-19 ప్రపంచ కప్ (Under-19 World Cup) లో భారత జట్టు విజయయాత్ర కొనసాగుతోంది. బుధవారం జరిగిన సెమీఫైనల్లో ఆఫ్ఘనిస్తాన్ను 7 వికెట్ల తేడాతో ఓడించి భారత్ ఫైనల్లో అడుగుపెట్టింది. 311 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేజ్ చేసి భారత్ కొత్త రికార్డు సృష్టించింది. ఆరోన్ జార్జ్ 95 బంతుల్లో 115 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. వైభవ్ సూర్యవంశీ 68, ఆయుష్ మాత్రి 62 పరుగులు చేశారు. అంతకుముందు ఆఫ్ఘనిస్తాన్ 310/4 పరుగులు చేసింది. ఫైనల్లో భారత్ ఇంగ్లాండ్తో తలపడనుంది.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అఫ్గానిస్థాన్, నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 310 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఫైసల్ షినోజాడా (93 బంతుల్లో 110), ఉజైరుల్లా నియాజీ (86 బంతుల్లో 101 నాటౌట్) అద్భుత సెంచరీలతో కదం తొక్కారు. వీరిద్దరూ మూడో వికెట్కు 148 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
తాజా వార్తలు
- ఖతార్లో ప్రయాణికుల మెడిసిన్స్ కు ఈ-పర్మిట్..!!
- ఆన్లైన్ ట్రావెల్ మోసాలపై ప్రయాణికులకు హెచ్చరిక..!!
- షేక్ ఈసా బ్రిడ్జిపై తాత్కాలికంగా ఒక లేన్ మూసివేత..!!
- బహ్రెయిన్ లో స్మాల్ బోట్స్ కు రిమోట్ టెక్నికల్ తనిఖీలు..!!
- కువైట్లో అక్రమ గర్భస్రావాల కేసు.. డాక్టర్ అరెస్ట్..!!
- జీసీసీ-యూరప్ పార్లమెంటరీ సమావేశం.. ప్రాంతీయ భద్రతపై ఆందోళన..!!
- సౌదీలో ఎండల తీవ్రత.. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు..!!
- యూఏఈలో కొత్త విద్యాసంవత్సరానికి భారీగా పెరిగిన ఖర్చులు..!!
- మూడు వారాల విరామం తర్వాత బహ్రెయిన్, కువైట్కు ఎతిహాద్ విమాన సర్వీసులు పునఃప్రారంభం
- వాహనదారులకు రవాణా శాఖ గుడ్న్యూస్







