ఫైనల్ కి చేరుకున్న భారత్

- February 05, 2026 , by Maagulf
ఫైనల్ కి చేరుకున్న భారత్

ఐసీసీ అండర్-19 ప్రపంచ కప్‌ (Under-19 World Cup) లో భారత జట్టు విజయయాత్ర కొనసాగుతోంది. బుధవారం జరిగిన సెమీఫైనల్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించి భారత్ ఫైనల్లో అడుగుపెట్టింది. 311 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేజ్ చేసి భారత్ కొత్త రికార్డు సృష్టించింది. ఆరోన్ జార్జ్ 95 బంతుల్లో 115 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. వైభవ్ సూర్యవంశీ 68, ఆయుష్ మాత్రి 62 పరుగులు చేశారు. అంతకుముందు ఆఫ్ఘనిస్తాన్ 310/4 పరుగులు చేసింది. ఫైనల్లో భారత్ ఇంగ్లాండ్‌తో తలపడనుంది.

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అఫ్గానిస్థాన్, నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 310 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఫైసల్ షినోజాడా (93 బంతుల్లో 110), ఉజైరుల్లా నియాజీ (86 బంతుల్లో 101 నాటౌట్) అద్భుత సెంచరీలతో కదం తొక్కారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 148 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com