ఫైనల్ కి చేరుకున్న భారత్
- February 05, 2026
ఐసీసీ అండర్-19 ప్రపంచ కప్ (Under-19 World Cup) లో భారత జట్టు విజయయాత్ర కొనసాగుతోంది. బుధవారం జరిగిన సెమీఫైనల్లో ఆఫ్ఘనిస్తాన్ను 7 వికెట్ల తేడాతో ఓడించి భారత్ ఫైనల్లో అడుగుపెట్టింది. 311 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేజ్ చేసి భారత్ కొత్త రికార్డు సృష్టించింది. ఆరోన్ జార్జ్ 95 బంతుల్లో 115 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. వైభవ్ సూర్యవంశీ 68, ఆయుష్ మాత్రి 62 పరుగులు చేశారు. అంతకుముందు ఆఫ్ఘనిస్తాన్ 310/4 పరుగులు చేసింది. ఫైనల్లో భారత్ ఇంగ్లాండ్తో తలపడనుంది.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అఫ్గానిస్థాన్, నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 310 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఫైసల్ షినోజాడా (93 బంతుల్లో 110), ఉజైరుల్లా నియాజీ (86 బంతుల్లో 101 నాటౌట్) అద్భుత సెంచరీలతో కదం తొక్కారు. వీరిద్దరూ మూడో వికెట్కు 148 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
తాజా వార్తలు
- రంజాన్ సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు ప్రత్యేక వెసులుబాటు
- తిరుపతి నుండి గల్ఫ్ దేశాలకు విమాన సర్వీసులు నడపాలి: ఎంపీ రఘునాధరెడ్డి
- US ప్రతినిధుల సభలో H-1B వీసాల రద్దు బిల్లు
- మహిళలకు APSRTC శుభవార్త..
- ఆటో రంగంలో భారత్కు బిగ్ బూస్ట్, చైనాకు షాక్
- మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో..సైబరాబాద్ సీపీ దిశానిర్దేశం
- లోక్ భవన్లో గవర్నర్ను కలిసిన అసెంబ్లీ స్పీకర్
- మీడియా సిటీ ఖతార్.. 244 సంస్థలు ఆసక్తి..!!
- 46వ అల్బరాకా ఫోరమ్ ప్రారంభించిన మదీనా అమీర్..!!
- యూఏఈ మొట్టమొదటి రోడ్-రైల్ అంబులెన్స్..!!









