మాల్లో నిలిచిన విద్యుత్ సరఫరా.. ప్రెక్షకులకు కాంప్లిమెంటరీ టిక్కెట్స్..!
- June 19, 2023
దుబాయ్: దుబాయ్లోని ఒక మాల్లో శుక్రవారం అర్థరాత్రి విద్యుత్తు అంతరాయం ఏర్పడిన విషయం తెలిసిందే. అల్ బార్షాలోని మాల్ ఆఫ్ ఎమిరేట్స్ వద్ద విద్యుత్తు అంతరాయం ఏర్పడింది.దీంతో VOX సినిమాస్ లో ఉన్న ప్రేక్షకులు తీవ్ర అసహనానికి గురయ్యారు. ముందు జాగ్రత్తగా వారిన బయటకు పంపించారు. కాగా, బాధితులైన వారి సౌలభ్యం మేరకు VOX సినిమాస్కి మళ్లి రావడానికి కాంప్లిమెంటరీ టిక్కెట్ జారీ చేయనున్నట్టు మాల్ నిర్వాహకులు తెలిపారు. కొద్ది గంటల్లోనే విద్యుత్ను వెంటనే పునరుద్ధరించినట్లు పేర్కొన్నారు.అయితే, సినిమా ప్రేక్షకులను క్రమ పద్ధతిలో ఖాళీ చేయిస్తున్నట్లు చూపే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దుబాయ్లో విద్యుత్తు అంతరాయాలు చాలా అరుదు. ఏప్రిల్ 2017లో దుబాయ్ మాల్లో దాదాపు రెండు గంటలపాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మరుసటి రోజు యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్, రియల్ ఎస్టేట్ డెవలపర్లు మరియు కంపెనీలు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా జరిగేందుకు అదనపు విద్యుత్ జనరేటర్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
తాజా వార్తలు
- బోయింగ్ 777-300ERSF కార్గో విమానాన్ని ప్రవేశపెట్టిన తొలి ఎయిర్లైన్గా ఎమిరేట్స్ రికార్డు
- తెలంగాణ స్పెషల్ పోలీసు పనితీరు పై డీజీపీ ఆనంద్ సమీక్ష..
- DRDO కొత్త డైరెక్టర్ జనరల్గా డాక్టర్ జగన్నాథ్ నాయక్
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు
- నకిలీ సమ్మర్ ట్రావెల్ ఆఫర్ల పై అప్రమత్తంగా ఉండండి..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ట్యాక్స్ పెనాల్టీ మాఫీ పథకాన్ని పొడిగించిన సౌదీ అరేబియా..!!
- యునెస్కోలో సుల్తాన్ హైథమ్ చారిత్రక ప్రసంగం..!!
- రాయల్ యూనివర్శిటీ ఫర్ విమెన్ లో ఘనంగా 18వ స్నాతకోత్సవం..!!
- పాస్పోర్ట్, కాన్సులర్ సేవల రుసుములను సవరించిన ఎంబసీ..!!







