దుబాయ్ లో ఏడు కొత్త ఫుట్బ్రిడ్జ్లు పూర్తి: ఆర్టీఏ
- June 19, 2023
యూఏఈ: దుబాయ్లోని వివిధ ప్రాంతాలలో ఏడు కొత్త ఫుట్బ్రిడ్జ్లను పూర్తి చేసినట్లు రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల బోర్డు చైర్మన్, డైరెక్టర్ జనరల్ మత్తర్ అల్ తాయర్ ప్రకటించారు. ఈ పాదచారుల వంతెనలు యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి మరియు దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఆదేశాలకు అనుగుణంగా నిర్మించబడ్డాయని చెప్పారు. ఈ వంతెనలు రోడ్డు మార్గాలను దాటే పాదచారులకు సురక్షితంగా, దుబాయ్ని సైకిల్-ఫ్రెండ్లి నగరంగా అభివృద్ధి చేయడానికి, నగరం శ్రేయస్సును ప్రోత్సహిస్తాయి. ఈ లక్ష్యాలను చేరుకోవడం దుబాయ్ నివాసితులు, సందర్శకుల ఆనందాన్ని పెంచుతుందని ఆర్టీఏ తెలిపింది.
దుబాయ్ హాస్పిటల్ సమీపంలోని ఒమర్ బిన్ ఖత్తాబ్ స్ట్రీట్, అబూ బకర్ అల్ సిద్దిక్ స్ట్రీట్ కూడలి మధ్య అల్ ఖలీజ్ స్ట్రీట్ను కలిపే వంతెన కొత్త ఫుట్బ్రిడ్జ్లలో ఒకటి. ఎమిరేట్లో మొత్తం 888 మీటర్ల పొడవుతో మరో ఆరు ఫుట్బ్రిడ్జిలు నిర్మించారు. వంతెనలు ప్రత్యేక బైక్ ట్రాక్లు మరియు రాక్లతో అమర్చబడి ఉంటాయి. హైటెక్ ఎలక్ట్రోమెకానికల్ సిస్టమ్స్, అలారాలు, అగ్నిమాపక, రిమోట్ మానిటరింగ్ సిస్టమ్లను నిర్మాణంలో వినియోగించారు.
“ఫుట్బ్రిడ్జ్ల నిర్మాణం దుబాయ్ ట్రాఫిక్ భద్రతా వ్యూహానికి అనుగుణంగా ఉంది. ఇది ట్రాఫిక్ భద్రత పరంగా నగరాన్ని ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైనదిగా చేయాలనే లక్ష్యంతో ఉంది. ఇది వాహనదారులు మరియు సైక్లిస్టులకు మౌలిక సదుపాయాలు, భద్రతా చర్యలను అందించడం ద్వారా రన్-ఓవర్ ప్రమాదాల నుండి మరణాలను సున్నాకి తగ్గించడానికి ప్రయత్నిస్తుంది. గత 17 సంవత్సరాలలో ఫుట్బ్రిడ్జ్ల సంఖ్య పదిరెట్లు పెరిగింది. 2006లో 13 నుండి గత సంవత్సరం చివరి నాటికి 129కి పెరిగింది. RTA మరో 36 ఫుట్బ్రిడ్జిలను 2021-2026లో నిర్మించాలని భావిస్తోంది. దీనితో మొత్తం పాదచారుల వంతెనల సంఖ్య 165కి చేరుకుంది. ”అని అల్ తాయర్ తెలిపారు. రోడ్వేలను దాటుతున్నప్పుడు, దుబాయ్ని సందర్శించే పౌరులు, నివాసితులు మరియు పర్యాటకులు ఫుట్బ్రిడ్జ్లు, సబ్వేలను ఉపయోగించాలని అల్ తాయర్ కోరారు.
-దుబాయ్ హాస్పిటల్ సమీపంలోని ఒమర్ బిన్ అల్ ఖత్తాబ్ స్ట్రీట్, అబూ బకర్ అల్ సిద్దిక్ స్ట్రీట్ జంక్షన్లను కలుపుతూ అల్ ఖలీజ్ స్ట్రీట్లో కొత్త ఫుట్బ్రిడ్జిని RTA ప్రారంభించింది. ఈ వంతెన దాదాపు 120 మీటర్ల పొడవు, 3.4 మీటర్ల వెడల్పు మరియు తారు నుండి 6.5 మీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది.
-అల్ సఖర్ మరియు అల్ మినా కూడళ్ల మధ్య ఉన్న అల్ మినా స్ట్రీట్లో 109 మీటర్ల పొడవు, 3.4 మీటర్ల వెడల్పు మరియు తారు నుండి 6.5 మీటర్ల ఎత్తులో వంతెన ఉంది.
- షేక్ ఖలీఫా బిన్ జాయెద్ స్ట్రీట్ మరియు షేక్ సబా అల్ అహ్మద్ అల్ జబర్ అల్ సబా స్ట్రీట్ మధ్య షేక్ రషీద్ బిన్ సయీద్ వీధిలో ఉంది. ఇది 91 మీటర్ల పొడవు, 3.4 మీటర్ల వెడల్పు మరియు తారు నుండి 6.5 మీటర్ల ఎత్తులో నిర్మించారు.
-క్రీక్ హార్బర్ మరియు రస్ అల్ ఖోర్ ఇండస్ట్రియల్ ఏరియా మధ్య లింక్ను ఏర్పరుచుకుంటూ రస్ అల్ ఖోర్ రోడ్లో మూడవ ఫుట్బ్రిడ్జ్ నిర్మించబడుతుంది. ఇది మొదటి విభాగంలో 174 మీటర్ల పొడవు 3.4 మీటర్ల వెడల్పు, రెండవ విభాగంలో 4.1 మీటర్లు మరియు తారు నుండి 6.5 మీటర్ల ఎత్తులో ఉంది.
- రస్ అల్ ఖోర్ రోడ్లో నేరుగా నద్ అల్ హమర్లోని మర్హబా మాల్ మరియు వాస్ల్ కాంప్లెక్స్ మీదుగా నిర్మించబడుతుంది.
-అల్ క్వోజ్ క్రియేటివ్ జోన్లోని అల్ మనారా రోడ్లో నిర్మించబడుతుంది.
- అల్ ఖవానీజ్ స్ట్రీట్లో అరేబియా సెంటర్కు ఎదురుగా నిర్మించబడుతుంది. ఇది 248 మీటర్ల పొడవు, 5.6 మీటర్ల వెడల్పు మరియు తారు నుండి 6 మీటర్ల ఎత్తు కలిగి ఉంది. ఈ వంతెనలో రెండు ఎలక్ట్రిక్ ఎలివేటర్లు, రెండు ర్యాంప్లు ఉంటాయి. వీటిలో ప్రతి రాంప్ పొడవు 128.5 మీటర్లు మరియు వెడల్పు 5.6 మీటర్లు. ఈ బ్రిడ్జి ఆ ప్రాంతంలోని సైక్లింగ్ ట్రాక్కి కూడా అనుసంధానించబడుతుంది.
తాజా వార్తలు
- భారత్లో త్వరలో 2 కొత్త ఎయిర్లైన్స్..
- రైతుల ప్రాణాలతో ఆటాడుతున్న ప్రభుత్వం: కేటీఆర్
- 'అటల్ స్మృతి న్యాస్ సొసైటీ' అధ్యక్షులుగా వెంకయ్యనాయుడు
- 22 సెంచరీలతో హజారే ట్రోఫీ ప్రారంభం
- 2029 ఎన్నికల ఫలితాల రిజల్ట్ ను ముందే చెప్పిన సీఎం రేవంత్
- ప్రజాస్వామ్య బలోపేతంలో మీడియా పాత్ర కీలకం: మంత్రి పార్థసారధి
- కేంద్రం పరిచయం చేస్తున్న ‘భారత్ టాక్సీ’ యాప్
- న్యూఇయర్ వేడుకలు..హద్దు మీరితే కఠిన చర్యలు
- అల్-అకిలా బీచ్ రీ డెవలప్ మెంట్ ప్రారంభం..!!
- ఖతార్లో స్థిరంగా టూరిజం గ్రోత్.. జీసీసీ మద్దతు..!!







