ఆంధ్ర ప్రదేశ్ లో యూజీ-డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్లకు దరఖాస్తుల స్వీకరణ

- June 19, 2023 , by Maagulf
ఆంధ్ర ప్రదేశ్ లో యూజీ-డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్లకు దరఖాస్తుల స్వీకరణ

అమరావతి: ఏపీలోని విద్యాలయాల్లో యూజీ-డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్లకు సోమవారం నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. యూజీ-డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్లకు విద్యార్థులు సోమవారం (జూన్19,2023) నుంచి (జూన్ 24, 20923) వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

జూన్ 26 నుంచి 30 వరకు వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చు. జూలై 3న సీట్లు కేటాయింపు ఉంటుంది. జూలై 4 నుంచి క్లాసులు ప్రారంభం కానున్నాయి.

స్పెషల్ కేటగిరీ అభ్యర్థులకు జూన్ 21 నుంచి 23 వరకు విజయవాడ ఎస్ఆర్ఆర్ మరియు సీవీఆర్, విశాఖ VS కృష్ణ, తిరుపతి ఎస్వీ వర్సిటీలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com