హైదరాబాద్లో నూతన ప్రాంతీయ కార్యాలయాన్ని ప్రారంభించిన SBI జనరల్ ఇన్సూరెన్స్
- June 19, 2023హైదరాబాద్: భారతదేశంలోని ప్రముఖ బీమా కంపెనీలలో ఒకటైన SBI జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, తెలంగాణ, కర్ణాటక, అమరావతిలలో తన ఉనికిని బలోపేతం చేసే ప్రయత్నంలో ఉంది. ఇందులో భాగంగా హైదరాబాద్లో తన కొత్త ప్రాంతీయ కార్యాలయాన్ని ప్రారంభించింది. SBI జనరల్ ఇన్సూరెన్స్ MD & CEO కిషోర్ కుమార్ పోలుదాసు, SBI – హైదరాబాద్ సర్కిల్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ అమిత్ జింగ్రాన్, SBI – అమరావతి సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ నవీన్ చంద్ర ఝా సమక్షంలో ప్రాంతీయ కార్యాలయాన్ని ప్రారంభించారు.
హైదరాబాద్లో ఈ కొత్త ప్రాంతీయ కార్యాలయాన్ని ప్రారంభించడం ద్వారా, బీమా అవగాహనను బలోపేతం చేయడం, దాని పరిధిని విస్తరించడం లక్ష్యంగా కంపెనీ ముందుకు సాగుతుందని ప్రతినిధులు అన్నారు. ఈ కార్యాలయం మూడు రాష్ట్రాల్లో వివిధ ఛానెల్లు, లైన్స్ ఆఫ్ బిజినెస్ (LoBs)కి కేంద్ర బిందువుగా పనిచేస్తూ, సజావు సమన్వయం, మెరుగైన కస్టమర్ సేవను అందిస్తుందని తెలిపారు. ఈ వ్యూహాత్మక చర్య హైదరాబాద్, దాని పరిసర ప్రాంతాల్లోని వ్యక్తులు, వ్యాపారుల జీవితాలను ఆస్తులను సురక్షితం చేయడంలో SBI జనరల్ యొక్క అంకితభావాన్ని ప్రతిబింబిస్తుందని తెలిపారు.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి