హైదరాబాద్లో నూతన ప్రాంతీయ కార్యాలయాన్ని ప్రారంభించిన SBI జనరల్ ఇన్సూరెన్స్
- June 19, 2023
హైదరాబాద్: భారతదేశంలోని ప్రముఖ బీమా కంపెనీలలో ఒకటైన SBI జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, తెలంగాణ, కర్ణాటక, అమరావతిలలో తన ఉనికిని బలోపేతం చేసే ప్రయత్నంలో ఉంది. ఇందులో భాగంగా హైదరాబాద్లో తన కొత్త ప్రాంతీయ కార్యాలయాన్ని ప్రారంభించింది. SBI జనరల్ ఇన్సూరెన్స్ MD & CEO కిషోర్ కుమార్ పోలుదాసు, SBI – హైదరాబాద్ సర్కిల్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ అమిత్ జింగ్రాన్, SBI – అమరావతి సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ నవీన్ చంద్ర ఝా సమక్షంలో ప్రాంతీయ కార్యాలయాన్ని ప్రారంభించారు.
హైదరాబాద్లో ఈ కొత్త ప్రాంతీయ కార్యాలయాన్ని ప్రారంభించడం ద్వారా, బీమా అవగాహనను బలోపేతం చేయడం, దాని పరిధిని విస్తరించడం లక్ష్యంగా కంపెనీ ముందుకు సాగుతుందని ప్రతినిధులు అన్నారు. ఈ కార్యాలయం మూడు రాష్ట్రాల్లో వివిధ ఛానెల్లు, లైన్స్ ఆఫ్ బిజినెస్ (LoBs)కి కేంద్ర బిందువుగా పనిచేస్తూ, సజావు సమన్వయం, మెరుగైన కస్టమర్ సేవను అందిస్తుందని తెలిపారు. ఈ వ్యూహాత్మక చర్య హైదరాబాద్, దాని పరిసర ప్రాంతాల్లోని వ్యక్తులు, వ్యాపారుల జీవితాలను ఆస్తులను సురక్షితం చేయడంలో SBI జనరల్ యొక్క అంకితభావాన్ని ప్రతిబింబిస్తుందని తెలిపారు.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







