ఏలియన్స్ ఎయిర్ విమానం ఇంధన ట్యాంకు తెరచి ఉండగానే టేకాఫ్..
- June 22, 2023
న్యూ ఢిల్లీ: ఏలియన్స్ ఎయిర్ విమానం ఇంధన ట్యాంకు మూత తెరచి ఉండగానే టేకాఫ్ అయిన ఘటన సంచలనం రేపింది. ఏలియన్స్ ఎయిర్ కు చెందిన ఏటీ 72-600 విమానం మైసూర్ నుంచి హైదరాబాద్ కు బయలుదేరే సమయంలో ఇంధన ప్యానల్ తెరచి ఉండటాన్ని గమనించారు. విమానం ఇంధన ప్యానల్ తెరచి ఉండటంపై ఏటీసీకి సమాచారం అందించారు.
మైసూర్ విమానాశ్రయంలో ఈ విమానంలోకి ఇంధనం నింపలేదు. అయినా ఇంధన ట్యాంకు మూత ఎలా తెరచి ఉందనే విషయంపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA)విచారణకు ఆదేశించింది. మైసూర్ విమానాశ్రయంలో టేకాఫ్ అయిన ఎలియన్స్ ఎయిర్ విమానం వెంటనే తిరిగి విమానాశ్రయానికి వచ్చింది. విమానం ఇంధన ట్యాంకు ప్యానల్ గాలిలో తెరుచుకున్నట్లు చెబుతున్నారు.
ఇలా విమానం ఇంధన ట్యాంకు తెరిచి ఉండటం వల్ల పెద్ద ప్రమాదం జరిగేదని నిపుణులు చెబుతున్నారు. దీనిపై విచారణ జరుగుతోందని, విచారణ పూర్తయిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని డీజీసీఏ తెలిపింది.ఈ ఘటనపై విమానయాన సంస్థ ప్రకటన చేయడానికి నిరాకరించింది.
తాజా వార్తలు
- ఇరాన్కు ట్రంప్ అల్టిమేటం!
- రాజస్థాన్ పై హైదరాబాద్ విజయం
- గమ్యస్థానానికి సురక్షితంగా చేరుదాం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్
- ఇరాన్ ఓడరేవులను దిగ్బంధించిన అమెరికా
- బెట్టింగ్లు, జూదం పై కఠిన చర్యలు: డిజిపి హరీష్ కుమార్ గుప్తా
- మహిళల టీ20 ప్రపంచ కప్: రికార్డు స్థాయిలో రూ.81 కోట్ల ప్రైజ్ మనీ!
- ఖతార్ ఎయిర్వేస్ ప్రయాణికులకు గుడ్ న్యూస్...
- యూఏఈ అధ్యక్షుడు–బహ్రెయిన్ రాజు భేటీ..
- డిగ్రీ అడ్మిషన్ల షెడ్యూల్ మరియు ముఖ్యమైన తేదీలు!
- అందుబాటులోకి 62 గ్రామీణ అన్న క్యాంటీన్లు









