స్వీడన్ రాయబారికి సమన్లు జారీ చేసిన యూఏఈ
- June 30, 2023
యూఏఈ: స్వీడన్ రాజధాని స్టాక్హోమ్లో పవిత్ర ఖురాన్ ప్రతులను కాల్చడాన్ని యూఏఈ నిరసన వ్యక్తం చేసింది. ఈ ఘటనకు సంబంధించి స్వీడిష్ ప్రభుత్వంపై UAE తీవ్ర నిరసన, ఖండనను తెలియజేయడానికి.. UAE విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ UAEలోని స్వీడన్ రాయబారి లిసెలాట్ ఆండర్సన్ను పిలిపించింది. స్వీడన్ తన అంతర్జాతీయ బాధ్యతలను విస్మరించిందని, ఈ విషయంలో సామాజిక విలువల పట్ల గౌరవం చూపలేదని UAE చెప్పింది. శాంతి, భద్రతను ప్రతికూలంగా ప్రభావితం చేసే ద్వేషపూరిత ప్రసంగం, జాత్యహంకార వ్యక్తీకరణలను పర్యవేక్షించడం ప్రాముఖ్యతను నొక్కి చెప్పింది. అంతేకాకుండా, ఇటువంటి హేయమైన చర్యలకు సమర్థనగా భావ ప్రకటనా స్వేచ్ఛను ఉపయోగించడాన్ని మంత్రిత్వ శాఖ తిరస్కరిస్తుందని స్పష్టం చేసింది.విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని యూరోపియన్ వ్యవహారాల విభాగం డైరెక్టర్ అయేషా బిన్ సువైదాన్ అల్ సువైదీ, మానవ విలువలు మరియు సూత్రాలకు విరుద్ధంగా భద్రత, స్థిరత్వాన్ని అణగదొక్కడానికి ఉద్దేశించిన అన్ని పద్ధతులను UAE తిరస్కరిస్తున్నట్లు ధృవీకరిస్తూ, రాయబారికి నిరసనను తెలియజేసింది.
తాజా వార్తలు
- రష్యాలో డ్రోన్ దాడి.. భారత విద్యార్థికి గాయాలు
- బెంగాల్ యువకుడికి అండగా నిలిచిన అనంత్ అంబానీ
- ఇండిగో వెబ్సైట్ క్రాష్.. ఆన్లైన్ సేవలకు తీవ్ర అంతరాయం..!
- అబుదాబిలో అక్రమంగా కార్ వాష్ చేస్తే Dh4,000 వరకు జరిమానా
- బహ్రెయిన్లో ఘోర అగ్నిప్రమాదం.. తల్లి, ముగ్గురు పిల్లలు మృతి
- షార్జాలో వాహన నంబర్ ప్లేట్ల సేకరణ సర్వీస్.. నూన్తో పోలీసుల భాగస్వామ్యం
- ఏపీ మున్సిపల్ పోరుకు సర్కార్ సిద్ధం..
- జెడ్డాలో ‘ఇండియా ఉత్సవ్’లో పాల్గొన్న కాన్సుల్ జనరల్ ఫహద్ సూరి
- గెలుపే లక్ష్యంగా పనిచేయండి.. పార్టీ శ్రేణులకు జగన్ దిశానిర్దేశం
- తప్పుదారి పట్టించిన డ్రైవింగ్.. అబుదాబిలో డ్రైవర్కు 6 నెలల జైలు, Dh100,000 జరిమానా







