జులై 11న ఐదు గంటలపాటు శ్రీవారి దర్శనాలు నిలిపివేత
- July 04, 2023
తిరుమల: తిరుమలలో జులై 11న శ్రీవారి దర్శనాలను ఐదు గంటలపాటు నిలిపివేయనున్నట్లు టీటీడీ తెలిపింది. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో జులై 11న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తున్నట్లు టీటీడీ అధికారులు పేర్కొన్నారు. జులై 17న ఆణివార ఆస్థానం సందర్భంగా ఆలయంలో తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. సంవత్సరంలో నాలుగు సార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని నిర్వహిస్తారని వెల్లడించారు.
ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఉదయం 6 గంటలకు ప్రారంభమయ్యే తిరుమంజనం కార్యక్రమం 5 గంటల పాటు కొనసాగుతుందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఐడు గంటల పాటు భక్తులకు శ్రీవారి దర్శనం నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు.
తిరుమంజనం అనంతరం శ్రీవారి మూలవిరాట్టుకు ఆగమోక్తంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించి మధ్యాహ్నం 12గంటల నుంచి భక్తులకు శ్రీవారి దర్శనానికి అనుమతిస్తామని తెలిపారు. తిరుమంజనం కారణంగా మంగళవారం నిర్వహించే అష్టదళపాదపద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది.
తాజా వార్తలు
- ఉమ్రా వీసాల జారీ నిలిపివేత..మక్కా ప్రవేశం పై ఆంక్షలు..!!
- రిటైల్ పేమెంట్స్.. 85% వాటా ఈ-చెల్లింపులదే..!!
- అక్షయ తృతీయకు ముందు దుబాయ్లో తగ్గిన బంగారం ధరలు..!!
- తాజా పరిణామాల పై సుల్లాన్, యూకే పీఎం చర్చలు..!!
- ప్రైవేట్ సంస్థల్లో క్లాస్ రూమ్ లెర్నింగ్ తిరిగి ప్రారంభం..!!
- కువైట్ పౌరసత్వ చట్టానికి సవరణలు..గెజిట్లో పబ్లిష్..!!
- హెన్లీ గ్లోబల్ ర్యాంకింగ్స్..ఖతార్ పాస్పోర్ట్ ముందంజ..!!
- తిరుమల లగేజీ కౌంటర్ సేవలు పూర్తిగా ఉచితం: టీటీడీ ప్రకటన
- మహిళా రిజర్వేషన్ బిల్లుతో సరికొత్త చరిత్ర: ప్రధాని మోదీ
- ‘మళ్లీ టీఆర్ఎస్గా’..! కేటీఆర్ కీలక వ్యాఖ్యలు









