అల్లూరి దేశభక్తి అసామానమైనది: రాష్ట్రపతి ముర్ము
- July 04, 2023
హైదరాబాద్: అల్లూరి సీతారామరాజు పోరాటం.. దేశభక్తి అసామానమైనదని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. హైదరాబాద్లో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల ముగింపు వేడుకల్లో రాష్ట్రపతి పాల్గొన్నారు. అల్లూరి పోరాటం కూడా ప్రజల్లో స్ఫూర్తి నింపిందని పేర్కొన్నారు. అల్లూరి ఒక ప్రత్యేకమైన యుద్ధ నైపుణ్యంతో ఆంగ్లేయులపై పోరాటం చేశారన్నారు. మహనీయుల చరిత్రను భవిష్యత్ తరాలకు భద్రంగా అందించాలని అన్నారు. బ్రిటీష్ బంధనాల నుంచి భారత మాత విముక్తి కోసం పోరాడిన మన్యం వీరుడు అల్లూరి అని సీఎం కేసీఆర్ కొనియాడారు. బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించారని అన్నారు. అల్లూరి గొప్పతనాన్ని.. చరిత్రను ముందు తరాలకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. అల్లూరి పోరాటం మరువలేనిదని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు. గిరిజనుల స్వాతంత్ర్యం, సంస్కృతిని కాపాడేందుకు ఆయన పోరాటం చేశారన్నారు. అల్లూరి ఒక వర్గానికే పరిమితమైన వ్యక్తి కాదని అన్నారు కేంద్రమంత్రి కిషన్రెడ్డి. సూర్యచంద్రులు ఉన్నంతవరకు విస్మరించలేని క్షత్రియ వీరుడు అల్లూరి అని కొనియాడారు.
తాజా వార్తలు
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు
- నకిలీ సమ్మర్ ట్రావెల్ ఆఫర్ల పై అప్రమత్తంగా ఉండండి..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ట్యాక్స్ పెనాల్టీ మాఫీ పథకాన్ని పొడిగించిన సౌదీ అరేబియా..!!
- యునెస్కోలో సుల్తాన్ హైథమ్ చారిత్రక ప్రసంగం..!!
- రాయల్ యూనివర్శిటీ ఫర్ విమెన్ లో ఘనంగా 18వ స్నాతకోత్సవం..!!
- పాస్పోర్ట్, కాన్సులర్ సేవల రుసుములను సవరించిన ఎంబసీ..!!
- జూలై నెల పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!
- మే నెలలో QR1.73 బిలియన్ల విలువైన రియల్ ఎస్టేట్ లావాదేవీలు..!!
- తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సర్వర్లు డౌన్!







