మెగా డబుల్ ధమాకా.! ఒకే స్క్రీన్ పై అన్నదమ్ములిద్దరూ.!
- July 05, 2023
మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిసి ఒకే స్క్రీన్ పై కనిపిస్తే ఎలా వుంటుంది.? గతంలో ‘శంకర్ దాదా జిందాబాద్’ సినిమాలో ఈ కాంబోని కొన్ని సెకన్ల పాటు స్క్రీన్ పై చూశాం. ఆ తర్వాత మళ్లీ ఆ అవకాశం కోసం ఎంత ప్రయత్నించినా ఇంతవరకూ జరగలేదు.
కానీ, ఇప్పుడు అందుకు అవకాశమొచ్చిందా.? అంటే ఒకింత అవుననే చెప్పాలి. ఒకే స్క్రీన్ పై ఈ ఇద్దరూ కనిపించే అవకశాశముంది. అయితే, ఇక్కడే చిన్న ట్విస్ట్. ఒకే స్క్రీన్ పై కనిపిస్తారు. కానీ, కలిసి కాదు. ఏంటా ట్విస్ట్ అనుకుంటున్నారా.?
ఈ నెల 28న ‘బ్రో’ మూవీ రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఇదే రోజు, ఈ సినిమా రిలీజ్ కాబోయే ధియేటర్లలోనే మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’ సినిమా ట్రైలర్ని రిలీజ్ చేయనున్నారు.
అలా ఈ ఇద్దరూ ఒకే స్క్రీన్పై కనిపించబోతున్నారు. ఒకే ధియేటర్లో ఇద్దరు అభిమాన హీరోల్ని ఒకేసారి చూసే అవకాశం.. మెగా అభిమానులకు ఇది నిజమైన పండగే కదా. మెగా డబుల్ ట్రీట్ అంటే ఇదే మరి.
తాజా వార్తలు
- లైసెన్స్ లేకుండా వన్యప్రాణుల వేట.. నలుగురు సౌదీ పౌరుల అరెస్ట్..!!
- అనుమతి లేని పెప్టైడ్ ఉత్పత్తులపై ఖతార్ నిషేధం..!!
- గల్ఫ్ సైబర్ భద్రతకు బహ్రెయిన్ నాయకత్వం..!!
- మిర్బాత్లో ‘మరాఫీ అల్ లుబాన్’ తుది గడువు పొడిగింపు..!!
- షార్జా దుర్ఘటన.. స్వస్థలానికి బాలిక మృతదేహం తరలింపు..!!
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!







