పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!

- August 27, 2026 , by Maagulf
పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!

ఆసియా జూనియర్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో భారత యంగ్‌ గ్రాండ్‌మాస్టర్లు తమ ప్రతిభను చాటుతూ డబుల్ ధమాకా సృష్టించారు. ఓపెన్, బాలికల క్లాసికల్ విభాగాల్లో భారత క్రీడాకారులు మయాంక్‌ చక్రవర్తి, ప్రతీతి బోర్డోలోయ్‌ అద్భుత ప్రదర్శనతో టైటిళ్లు సొంతం చేసుకుని స్వర్ణ పతకాలను కైవసం చేసుకున్నారు.

ఓపెన్ విభాగంలో విజేతగా మయాంక్
బుధవారం జరిగిన క్లాసికల్‌ చివరి 9వ రౌండ్‌ను మయాంక్‌ చక్రవర్తి తెలివిగా డ్రా చేసుకున్నాడు. మొత్తం 7.5 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి ఓపెన్ విభాగంలో విజేతగా నిలిచాడు.

స్వర్ణం: మయాంక్ చక్రవర్తి (భారత్ – 7.5 పాయింట్లు)
రజతం: ఆర్టిం పిన్‌జిన్‌ (రష్యా)
కాంస్యం: దక్ష్‌ గోయెల్‌ (భారత్)
బాలికల విభాగంలో ప్రతీతికి స్వర్ణం
బాలికల క్లాసికల్‌ విభాగంలో భారత క్రీడాకారిణి ప్రతీతి బోర్డోలోయ్ కూడా ఆఖరి రౌండ్‌ను డ్రాగా ముగించింది. టోర్నీ అంతటా నిలకడైన ఆటతీరు కనబర్చిన ఆమె 7.5 పాయింట్లతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుని పసిడి పతకం దక్కించుకుంది.

స్వర్ణం: ప్రతీతి బోర్డోలోయ్‌ (భారత్ – 7.5 పాయింట్లు)
రజతం: మరియా ఖోల్యావ్‌కో (కజకిస్థాన్‌)
కాంస్యం: నివేదిత (భారత్)
ఈ టోర్నీలో పాల్గొన్న తెలుగు క్రీడాకారులు శరణ్య, అద్వైత్‌లు అనుకున్న స్థాయిలో రాణించలేకపోయారు. తీవ్ర పోటీ నెలకొన్న వారి వారి విభాగాల్లో ఇద్దరూ ఆరో స్థానంతో ముగించి నిరాశపరిచారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com